Cylinder price: సిలిండర్‌ ధర రూ.6 వేలు..! గ్యాస్ వినియోగదారులకు కేంద్రం మరో షాక్..!

గ్యాస్ వినియోగదారులకు కేంద్రం మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే బుకింగ్స్ మధ్య గ్యాప్‌ను రెండు సార్లు పెంచిన కేంద్రం తాజాగా మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో గ్యాస్ బుకింగ్ వెయిటింగ్ పీరియడ్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 25 రోజులుగా ఉండగా.. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు పెంచింది. ఈ మేరకు గురువారం ప్రకటన జారీ చేసింది. గతంలో గ్యాస్ వినియోగదారులు గ్యాస్ బుకింగ్ చేసుకున్నాక 21 రోజుల తర్వాత మరో గ్యాస్ బుక్ చేసుకునేందుకు అవకాశం ఉండేది. కానీ గ్యాస్ కొరత వల్ల దానిని ఈ మధ్య 25 రోజులకు మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గ్యాస్ సంక్షోభం దేశంలో ముదురుతుండటంతో గ్యాప్‌ను మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల గ్యాస్ కొరత తగ్గతుందని, బ్లాక్ మార్కెట్‌కు అడ్డుకట్ట పడుతుందని కేంద్రం భావిస్తోంది.

మరోవైపు దేశంలో కమర్షియల్ గ్యాస్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల పంపిణీని కేంద్రం నిలిపివేయడంతో హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా ఆగిపోయింది. దీంతో గ్యాస్ నిల్వలు లేకపోవడంతో రెస్టారెంట్లు, హోటల్స్, ఫుడ్ స్టాల్స్ అన్నీ దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో మూత పడుతున్నాయి. ఇదే అదునుగా భావించిన కొందరు కమర్షియల్ గ్యాస్‌ను బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌లో అయితే ఒక్కో సిలిండర్‌ను రూ.6 వేల వరకు విక్రయిస్తున్నారు. దీని వల్ల వ్యాపారులకు నష్టం జరుగుతుండగా.. హోటల్స్‌తో పాటు రెస్టారెంట్లలో పనిచేసే సిబ్బంది ఉపాధి దెబ్బతింటుంది. ఇక స్విగ్గి, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ బాయ్స్‌ ఉద్యోగాలకు కూడా ముప్పు ఏర్పడుతుంది. హాస్టల్స్ కూడా బంద్ అయ్యే అవకాశం ఉండటంతో విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. యుద్ధం ముగిసినా కానీ గ్యాస్ కొరత కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఆయిల్‌ రిఫైనరీలే లక్ష్యంగా దాడులు చేసుకుంటున్న దేశాలు, ఇప్పటికే లక్షల బ్యారెళ్లు ఉన్న చమురు కేంద్రాలను దాడులతో నిర్వీర్యం చేయడంతో ఈ కొరత ఇలాగే ఉండనుందని భావిస్తున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story