హైదరాబాద్‌లోని కృష్ణానగర్ పరిసర ప్రాంతాల్లో బిచ్చమెత్తుకుంటూ బతికే ఈ ముసలాయన.. ఓ ఇంటర్వ్యూలో 'కుర్చీ మడతపెట్టి..' అనే బూతు డైలాగ్ చెప్పి అలా ఫేమస్ అయిపోయాడు.

హైదరాబాద్‌లోని కృష్ణానగర్ పరిసర ప్రాంతాల్లో బిచ్చమెత్తుకుంటూ బతికే ఈ ముసలాయన.. ఓ ఇంటర్వ్యూలో 'కుర్చీ మడతపెట్టి..' అనే బూతు డైలాగ్ చెప్పి అలా ఫేమస్ అయిపోయాడు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఈ పదాన్ని 'గుంటూరు కారం' కోసం తమన్ ఉపయోగించుకున్నాడు. అందుకు గానూ సదరు కుర్చీ తాతకు డబ్బులు కూడా ఇచ్చాడు. యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన ఇతడు.. 'గుంటూరు కారం'లోని ఓ పాట వల్ల మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ కుర్చీ తాత చనిపోయాడని సోషల్‌ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. గత కొంత కాలంగా కనపడకుండా పోయిన కుర్చీతాత చనిపోయాడని అందరూ, అతని ఆత్మకు శాంతి చేకూరాలని, రెస్ట్ ఇన్‌ పీస్ తాతా అని కామెంట్స్‌ చేస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో కుర్చీతాత చనిపోయాడనే వార్తలు రావడంతో అది అబద్ధమని సోషల్‌ మీడియా ఇన్ఫ్లుయేన్సర్ వైజాగ్‌ సత్య చెప్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో చనిపోయింది కుర్చీతాత కాదని, కుర్చీతాత ఏ ఖమ్మం, వరంగల్‌ వెళ్లి ఉంటాడని, అతను ఎక్కడున్నా క్షేమంగానే ఉండి ఉంటాడని అతను ఓ వీడియో విడుదల చేశాడు.

Updated On
ehatv

ehatv

Next Story