ఈ నెల 1 నుంచి పలు కీలక మార్పులు రాబోతున్నాయి. ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ రుసుములు పెరుగుతాయి.

వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు స్లీపర్, ఏసీ బోగీల్లోకి అనుమతి ఉండదు
నేటి నుంచి వచ్చే మార్పులివే
ఈ నెల 1 నుంచి పలు కీలక మార్పులు రాబోతున్నాయి. ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ రుసుములు పెరుగుతాయి. భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ఇటీవల రెపో రేటును తగ్గించినందు వల్ల గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. 11 రాష్ట్రాల్లో బ్యాంకుల విలీనం ప్రభావం పడుతుంది.
ఏటీఎం ఫీజు
ఏటీఎం(ATM) ఇంటర్చేంజ్ ఫీజును మే 1 నుంచి పెంచడానికి ఆర్బీఐ ఆమోదం తెలిపింది. ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ, బ్యాలన్స్ చెక్, పిన్ ఛేంజ్ వంటి లావాదేవీ లకు నెలవారీ పరిమితులు ఉన్న సంగతి తెలి సిందే. ఈ పరిమితికి మించిన ప్రతి లావాదేవీకి ప్రస్తుతం రూ.21 వసూలు చేస్తున్నారు. దీనిని మే 1 నుంచి రూ.23కు పెంచారు..
రైల్వే టికెట్లు
వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న టికెట్లతో ప్రయాణికులు మే 1 నుంచి స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణించరాదని భారతీయ రైల్వే ప్రకటించింది. వీరు జనరల్ బోగీల్లో ప్రయాణించవచ్చునని చెప్పింది. క్యాన్సిలేషన్ రిఫండ్ సమయాన్ని 2 రోజులకు తగ్గించింది.
ఆదాయపు పన్ను రిటర్నులు
ఆదాయపు పన్ను శాఖ ఏప్రిల్ 30న ఐటీఆర్ ఫారం 1, 4లను విడుదల చేసింది. సంవత్స రానికి రూ.50 లక్షల కన్నా తక్కువ ఆదాయం గల వ్యక్తులు, సంస్థలు తమ ఐటీ రిటర్నులను మే నెలలో దాఖలు చేయవచ్చు.
బ్యాంకుల విలీనం
'ఒక రాష్ట్రం- ఒకే ఆర్ఆర్ బీ' విధానం మే 1 నుంచి అమల్లోకి వస్తుంది. 11 రాష్ట్రాల్లోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 'ఒక రాష్ట్రా నికి ఒకే ఆర్ఆర్ బీ'గా విలీనమవుతాయి.
