ఈ సంవత్సరం స్విగ్గీ ద్వారా భారతీయులు 93 మిలియన్ (9.3 కోట్లు) బిర్యానీలను ఆర్డర్ చేశారు

ఈ సంవత్సరం స్విగ్గీ ద్వారా భారతీయులు 93 మిలియన్ (9.3 కోట్లు) బిర్యానీలను ఆర్డర్ చేశారు, దీని వలన ఈ ప్రియమైన వంటకం ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లో అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకంగా నిలిచింది. స్విగ్గీలో అత్యధికంగా ఆర్డర్ చేయబడిన వంటకాల జాబితాలో బిర్యానీ అగ్రస్థానంలో ఉండటం ఇది వరుసగా 10వ సంవత్సరం. తమకు వచ్చిన ఆర్డర్లో "బిర్యానీ తిరుగులేని రాజు, బిర్యానీ పట్ల భారతీయులకు ఎంత ప్రేమ ఉందో ఇది నిరూపించిందని స్విగ్గీ ప్రకటించింది. భారతీయులు స్విగ్గీలో ప్రతి 3.25 సెకన్లకు ఒక బిర్యానీ ఆర్డర్ చేశారు. అంటే నిమిషానికి 194 బిర్యానీలు. అయితే ఇది డైరెక్ట్గా రెస్టారెంట్లలో తిన్నది కాకుండా, ఇతర ఫుడ్ డెలివరీలను కలుపుకున్నది కాదు. ఒక్క స్విగ్గీలోనే ఇన్ని లక్షల ఆర్డర్లు వచ్చాయి.
స్విగ్గీ 2025లో 93 మిలియన్ బిర్యానీలు ఆర్డర్ చేశారు. చికెన్ బిర్యానీ 57.7 మిలియన్ ఆర్డర్లతో అత్యంత ప్రజాదరణ పొందినదిగా నిలిచింది. ఇతర వంటకాలను కూడా లక్షల్లో ఆర్డర్ చేశారు. 44.2 మిలియన్ ఆర్డర్లతో బర్గర్లు రెండో స్థానంలో నిలిచింది. 2025లో స్విగ్గీలో అత్యధికంగా ఆర్డర్ చేయబడిన మూడో వంటకం పిజ్జా (40.1 మిలియన్ ఆర్డర్లతో), 26.2 మిలియన్ ఆర్డర్లతో వెజ్ దోశ నాలుగో స్థానంలో నిలిచింది.


