Rohith Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్ మృతి వెనుక టీడీపీ కుట్ర..!

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్ మృతి వెనుక టీడీపీ కుట్ర ఉందని ఎన్సీపీ నేత రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు.

అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక టీడీపీ నేతల హస్తం ఉందన్నారు. విమానయాన సంస్థ వీఎస్ఆర్ యజమాని రోహిత్ సింగ్ కు టీడీపీ నేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, విచారణను నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. రామ్మోహన్ నాయుడును తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అజిత్ పవారి ప్రమాదం కాదు.. ప్రణాళిక ప్రకారం జరిగిన హత్య అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

మంత్రి తప్పు చేశాడని తాను నేరుగా ఆరోపించనప్పటికీ, విమానం ఆపరేటర్ అయిన VSRతో రాంమోహన్ నాయుడుకు "సన్నిహిత సంబంధాలు" కొనసాగుతున్న తరుణంలో దర్యాప్తు పారదర్శకత గురించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తుతున్నాయని రోహిత్ పవార్ అన్నారు. "రోహిత్ సింగ్ ఒక సంవత్సరం క్రితం జైపూర్‌లో వివాహం చేసుకున్నాడు. విమానయాన మంత్రి వివాహానికి హాజరయ్యారు" అని పవార్ అన్నారు.

నియంత్రణ సంస్థ కూడా విమానయాన మంత్రిత్వ శాఖ కింద ఉన్నందున ఈ విషయంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దర్యాప్తు "హాస్యాస్పదం" అని ఆయన అన్నారు. "దర్యాప్తు చేస్తున్న వారికి, విచారణ ఎదుర్కొనేవారికి సన్నిహిత సంబంధాలు ఉన్నప్పుడు విచారణ పారదర్శకంగా, న్యాయంగా ఎలా జరుగుతుందని అనుకుంటామని రోహిత్ పవార్‌ ప్రశ్నించారు. రోహిత్‌ పవార్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Updated On 19 Feb 2026 8:02 AM GMT
ehatv

ehatv

Next Story