తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. సీఎం విజయవాడలో దేవినేని ఇంట్లో పెళ్లి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ప్రకటన సమయం కొద్దిగా ఆలస్యమైంది. 5 లక్షలకు పైగా విద్యార్థులు మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను ఆన్‌లైన్‌లో bse.telangana.gov.in, results.bse.telangana.gov.in, results.bsetelangana.org వెబ్‌సైట్‌లలో చెక్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం, ఫలితాలు సబ్జెక్ట్‌ల వారీగా మార్కులు, గ్రేడ్‌లతో విడుదలయ్యాయి. గతంలో ఉన్న సీజీపీఏ సిస్టమ్‌ను రద్దు చేశారు. మొత్తం పాస్ శాతం 92.78%గా నమోదైంది, రెసిడెన్షియల్ స్కూళ్లు 98.79%తో అత్యధిక పాస్ రేట్ సాధించాయి.


Click Here

ehatv

ehatv

Next Story