విద్య, వైద్యం తప్ప మిగతావన్నీ ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.

విద్య, వైద్యం తప్ప మిగతావన్నీ ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాలలో మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి వేడుకలకు హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “ఫ్రీ బస్సులు ఇవ్వమని ఎవరు అడిగారు. ఉచితాల పేరుతో ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు. వాటిని ఆపేసి.. కష్టపడేవారికి చేయూతనివ్వాలి” అని అన్నారు. వాజ్‌పేయ జీవితం తెరిచిన పుస్తకమని.. ప్రతి పేజీ స్ఫూర్తిదాయకమని వెంకయ్యనాయుడు అన్నారు. శ్యామాప్రసాద్‌ ముఖర్జీ ఆశయ సాధన కోసం ఆయన కృషి చేశారని చెప్పారు.భాజపాకు బలమైన పునాది వేసిన వ్యక్తుల్లో వాజ్‌పేయి ముందు వరుసలో ఉంటారు. ఆయన్ను శ్యామాప్రసాద్‌ ముఖర్జీ శిష్యుడిగా ఎంచుకున్నారు. వాజ్‌పేయి అంటే సుపరిపాలన. యువతకు ఆదర్శం. ఆయన చూపిన మార్గంలో నడుస్తున్నామా? లేదా? అనేది ప్రతి కార్యకర్త ఆలోచించుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు.

Updated On
ehatv

ehatv

Next Story