ఈ రోజుల్లో అందం అంటే ఎవరికైన ఆసక్తే ..అందంగా కనిపించాలని చిన్న పిల్లల నుంచి మొదలు పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒకరికి అందంగా కనిపించాలనే ఆరాటం..చర్మం అందంగా కాంతి వంతంగా, సున్నితంగా లేకపోతే చాలా మంది ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. చర్మం మెరుస్తూ నిగానిగలాడేలాగా ఉండాలని అందరం ఆశపడుతాం! కానీ చర్మాన్ని ఎలా మెరిసెల చేసుకోవాలి.. ఇందుకోసం చాలా రకాల టిప్స్ ఫాలో అయ్యి ..ఎన్నో ప్రయత్నాలు చేసి ఆశించిన ఫలితం రాక ఆందోళన […]

ఈ రోజుల్లో అందం అంటే ఎవరికైన ఆసక్తే ..అందంగా కనిపించాలని చిన్న పిల్లల నుంచి మొదలు పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒకరికి అందంగా కనిపించాలనే ఆరాటం..చర్మం అందంగా కాంతి వంతంగా, సున్నితంగా లేకపోతే చాలా మంది ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. చర్మం మెరుస్తూ నిగానిగలాడేలాగా ఉండాలని అందరం ఆశపడుతాం! కానీ చర్మాన్ని ఎలా మెరిసెల చేసుకోవాలి.. ఇందుకోసం చాలా రకాల టిప్స్ ఫాలో అయ్యి ..ఎన్నో ప్రయత్నాలు చేసి ఆశించిన ఫలితం రాక ఆందోళన చెందుతూ ఉంటాం, సహజంగా ఎటువంటి కెమికల్స్ వాడకుండా చర్మాన్ని ముఖాన్ని ఎలా మెరిపించాలి? సులువుగా చర్మం అందంగా కాంతి వంతంగా మారటానికి మన ఇంట్లోనే చేసుకునే అద్బుతమైన బ్యూటీ టిప్స్ ఏంటో తెలుసుకుందాం.

ఫేస్ glow టిప్స్ లో నీరు ముఖ్య పాత్ర పోషిస్తుంది. చర్మం సహజంగా కాంతివంతంగా ముడతలు లేకుండా మారాలి అంటే నీరు ఎక్కువ గా తాగాలి. నీటిని ఎక్కువగా తాగటం వలన skin tone మెరుగుపడి కొల్లాజెన్ సమృద్దిగా ఉండటానికి సహకరిస్తుంది. చర్మం నీటిగా ఉండటానికి ఒక రోజుకి నాలుగు లీటర్స్ వరకు నీటిని తాగటం ఉత్తమం.చర్మానికి పచ్చి పాలలోని మీగడ రాసి 15 నిమిషాల తరువాత కడగాలి ఇలా చేస్తే చర్మంలోని మురికి పోయి సున్నితంగా తయారు అవుతుంది.

చర్మ సౌందర్యం పెంచుకునే౦దుకు చాలా ఏళ్ళ నుంచి ముల్తానీ మిట్టిని వినియోగిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని మెరుగు పరచడమే కాకుండా కాంతివంతంగా చేస్తాయి. ఈ మట్టిలో రోజ్‌వాటర్‌ మిక్స్‌ చేసి కళ్ల కింద నల్లని వలయాలు ఉన్న చోట అప్లై చేయడం వల్ల త్వరలోనే మంచి ఫలితాలు పొందుతారని చర్మ సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ముఖంపై మొటిమలను కూడా నియంత్రింస్తుంది. దీని కోసం ముల్తానీ మిట్టిని పేస్ట్ లాగా సిద్ధం చేసుకోవాలి. దీనిని రోజూ ముఖానికి అప్లై చేయండి. ముఖానికి సంబంధించిన సమస్యలన్నీ దూరమవుతాయి.

పెరుగు మనం తీసుకునే ఆహారం లో ఒక భాగమే కాకుండా అందాన్ని పెంచుకునే0దుకు ఇది ఎంతో దోహద పడుతుంది- .. . దీనిని క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగు పడుతుంది. అయితే ఈ పెరుగును ముఖ, చర్మ సౌందర్యం కోసం కూడా వినియోగించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ఇది చర్మంపై తేమను పెంచేందుకు కృషి చేయడమే కాకుండా.. ముఖంపై చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. అంతేకాకుండా చర్మంపై నలుపును కూడా తొలగిస్తుంది. అయితే దీని కోసం మొదటగా పెరుగును తీసుకుని.. రాత్రిపూట పెరుగును ముఖానికి అప్లై చేసి, 20 తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖంపై నలుపు తగ్గిపోవడమే కాకుండా.. చర్మం సౌందర్యంగా కనిపిస్తుంది.

ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల పాల‌ను తీసుకోవాలి. త‌రువాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ క‌ల‌బంద గుజ్జును, ఒక టీ స్పూన్ బాదం నూనెను వేసి అన్ని క‌లిసేలా బాగా క‌ల‌పాలి. ఈ మిశ్రమాన్ని దూది స‌హాయంతో ముఖానికి రాస్తూ 5 నుండి 10 నిమిషాల పాటు సున్నితంగా మ‌ర్దనా చేయాలి. ఇలా ప్రతి రోజు రాత్రి ప‌డుకునే ముందు ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఉద‌యాన్నే క‌డిగేయాలి. ఇందులో ఉప‌యోగించిన ప‌చ్చి పాలు, క‌ల‌బంద గుజ్జు, బాదం నూనె.. ఇలా ప్రతిది కూడా మ‌న చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డంలో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే మొటిమ‌లు,మచ్చలు మృతక‌ణాలు తొల‌గిపోతాయి. చ‌ర్మం రంగు తెల్లగా మార‌డ‌మే కాకుండా, ముఖం అందంగా, కాంతివంతంగా కూడా క‌న‌బ‌డుతుంది. ఈ మిశ్రమాన్ని కేవ‌లం ముఖంపైనే కాకుండా మెడ‌, చేతులు, పాదాలు వంటి ఇత‌ర శ‌రీర భాగాల‌పై ఉండే చ‌ర్మాన్ని తెల్లగా మార్చుకోవ‌డం కోసం కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. ఈ విధంగా ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల చాలా త‌క్కువ ఖ‌ర్చులో స‌హ‌జంగానే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వతంగా చ‌ర్మం రంగును తెల్లగా మార్చుకోవ‌చ్చు.

ఒక బౌల్ లో స్పూన్ కాఫీ పొడి, అర స్పూన్ కలబంద గుజ్జు, అర స్పూన్ రోజ్ వాటర్, ఒక స్పూన్ నిమ్మరసం తీసుకొవాలి.. ఈ పదార్థాలన్నింటినీ వేసి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ముందుగా చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోని.. ఈ ప్యాక్ ని ముఖాన్ని రాసుకుని ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తరవాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోవాలి. దీని వల్ల నల్లటి మచ్చలు, నలుపుదనం పోయి ముఖం ను కాంతివంతం చేస్తుంది. నిమ్మకాయ సహజసిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్ గా పని చేస్తుంది. నలుపుదనాన్ని పోగొట్టి చర్మం మెరిసేలా చేస్తుంది. ఇందులో ఉపయోగించిన కలబంద గుజ్జు శరీరంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించి ముఖాన్ని కాంతివంతం చేస్తుంది. కాఫీ పొడి కూడా ముఖంపై దుమ్ము ధూళిని తొలగించి ముఖాన్ని సహజమైన మెరుపును సంతరించుకునేలా చేస్తుంది. ఈ ప్యాక్ ను వారంలో రెండు సార్లు వేసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

గోదుమ పిండి ఒక స్పూన్ తీసుకొని అందులో ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ పాలు, నాలుగు చుక్కల నిమ్మరసం మరియు చిటికెడు పసుపు వేసి బాగా అన్నీ కలిసిపోయే లాగా చక్కగా కలపాలి. ఆ తరువాత ఈ పేస్ట్ ని ప్యాక్ లాగా ముఖానికి రాయాలి, 15 నిమిషాల తరువాత కొన్ని పాలు తీసుకొని ఒక చిన్న దూదిని ఆ పాలలో ముంచి circular motion లో ముఖం పైన రుద్దాలి, మళ్ళీ 10 నిమిషాల తరువాత దూదిని పాలలో ముంచి ముఖం మొత్తం రాయాలి ఆ తరువాత మామూలుగా నీటితో కడగాలి ఇలా కడిగిన 2గంటల వరకు ఎటువంటి soaps కానీ chemicals కానీ వాడకూడదు.ఇలా చేస్తే డెడ్ స్కిన్ cells పోయి చర్మం అందంగా తయారు అవుతుంది. గోదుమ పిండి అన్నీ రకాల చర్మం ఉన్నవారికి సహకరిస్తుంది అంటే ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్ ఉన్నవారికి కూడా పని చేస్తుంది అని చెప్పవచ్చు. గోదుమ పిండి చర్మాన్ని ఆరోగ్యంగా మరియు కాంతివంతగా ఉంచటానికి సహాయపడుతుంది.

Updated On 9 Feb 2023 2:41 AM GMT
Ehatv

Ehatv

Next Story