Clay Pots : మట్టి కుండలను ఇలా శుభ్రం చేస్తే అచ్చు ఉండదు..
గత మూడేళ్లలో ప్రజల జీవనశైలీ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం..ఫిట్ నెస్ పై ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారు. ఇప్పుడు అంతా జంక్ ఫుడ్ కాకుండా.. సహజ సిద్ధమైన ప్రకృతిలో లభించే ఆహారం తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. మన పూర్వీకులు జీవన విధానాన్ని అనుసరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎక్కువగా మట్టి పాత్రలను వినియోగిస్తున్నారు. ఎండ కాలంలో ఈ మట్టి కుండలలో నీటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Clay Pots
గత మూడేళ్లలో ప్రజల జీవనశైలీ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం..ఫిట్ నెస్ పై ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారు. ఇప్పుడు అంతా జంక్ ఫుడ్ కాకుండా.. సహజ సిద్ధమైన ప్రకృతిలో లభించే ఆహారం తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. మన పూర్వీకులు జీవన విధానాన్ని అనుసరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎక్కువగా మట్టి పాత్రలను వినియోగిస్తున్నారు. ఎండ కాలంలో ఈ మట్టి కుండలలో నీటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే వేసవిలో మట్టి పాత్రలను వంట కోసం ఉపయోగిస్తున్నారు. అయితే ఈ మట్టి కుండలను వంటకు వినియోగించిన తర్వాత శుభ్రం చేయడంలో చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు. మట్టి కుండను క్రమం తప్పకుండా ఉపయోగించిన తర్వాత నూనె మొత్తం అంటుకోవడంతో అడుగు భాగం మురికిగా ఉంటుంది. కుండలు ఇలా మురికిగా మారితే ఇలా సులభంగా శుభ్రం చేసుకోండి.
సబ్బు మట్టి కుండను అంత త్వరగా శుభ్రం చేయదు. అంతేకాదు.. సబ్బు వాసన దానికి అతుక్కుంటుంది. గతంలో మట్టి కుండలను బూడిదతో శుభ్రం చేసేవారు. అలాగే ఈ రోజు చాలా మంది పాన్ శుభ్రం చేయడానికి ఉపయోగించే మెటల్ స్క్రబ్బర్ను కూడా ఉపయోగించవద్దు. చాలా మృదువైన స్క్రబ్బర్ను ఉపయోగించడం మంచిది.
మట్టి కుండలను ఎలా శుభ్రం చేయాలంటే..
ముందుగా మట్టి పాత్రలో కొంచెం నీరు పోసి.. అందులో కాస్త సోడా పౌడర్ వేసి వేడి ఉంచాలి. నిమ్మకాయ తొక్క లేదా చిన్న ముక్కలుగా కట్ చేసిన నిమ్మకాయను అందులో వేసి బాగా మరిగించాలి. బాగా మరిగిన తర్వాత నీటిని వంపేయాలి. పెనం వేడిని తగ్గిన తర్వాత అందులో కాస్త శనగపిండి వేసి మెత్తగా స్క్రబ్బర్ తో కడిగేయాలి. మట్టి కుండలో ఎక్కువ తేమ ఉంటే అక్కడ అచ్చు పెరిగే అవకాశం ఉంది. శుభ్రపరిచిన తర్వాత ఎండలో పెట్టాలి. బాగా ఆరిన తర్వాత దానికి కొంచెం కొబ్బరి నూనె రాసి న్యూస్ పేపర్ తో కప్పి ఉంచాలి. ఇలా చేయడం వల్ల మట్టి కుండ బూజు పట్టకుండా ఉంటుంది. ఈ పద్ధతిని నెలకోసారి చేస్తే మట్టి కుండలు పాడవవు.
మట్టి కుండను ఉపయోగించడం వలన మెగ్నీషియం, కాల్షియం, భాస్వరం, ఇనుము, సల్ఫర్ మన శరీరంలోకి చేరుతాయి. అదేవిధంగా మనం తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం కావడానికి, ఆహారానికి మంచి రుచి రావడానికి మట్టి కుండను ఉపయోగించడం మంచిది. ఆహార పదార్థాలు చెడిపోకుండా ఉండేందుకు మట్టి కుండను ఉపయోగించడం మంచిది. మట్టి పాత్రలో నీటిని పోయడం వల్ల నీరు సహజంగా చల్లబడుతుంది.


