జోధ్‌పూర్‌కు చెందిన రాజకుమారి శివరంజని రాజ్యే(Shivranjani Rajye), ఆగస్టు 22, 1974న జన్మించారు.

జోధ్‌పూర్‌కు చెందిన రాజకుమారి శివరంజని రాజ్యే(Shivranjani Rajye), ఆగస్టు 22, 1974న జన్మించారు. ఆమె ది రాయల్ వంటి వెబ్ సిరీస్‌లలో చూపించే విలాసవంతమైన రాజ జీవనశైలికి భిన్నంగా, సాదాసీదాగా జీవిస్తారు. శివరంజని జోధ్‌పూర్ రాజవంశం అధిపతి మహారాజా గజ్ సింగ్ II-హేమలతా రాజ్యే దంపతుల కుమార్తె. ఆమె తల్లి వంశం పూంచ్, నేపాల్‌కు చెందినది. ఆమెకు ఒక తమ్ముడు యువరాజ్ శివరాజ్ సింగ్ ఉన్నాడు.

ఆమె కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో హ్యూమన్ సైన్సెస్, న్యూయార్క్‌లో ఫిల్మ్‌మేకింగ్ చదివారు. టీవీలో చూపించే వజ్రాలు, భారీ దుస్తులు, లేదా ఆడంబరమైన జీవనశైలి ఆమె వద్ద కనిపించదు. శివరంజని సాంప్రదాయ రాజ ఆడంబరాలకు దూరంగా, సరళమైన, ఆచరణాత్మక జీవనశైలిని ఎంచుకున్నారు. ఆమె తన కుటుంబ వారసత్వాన్ని, ముఖ్యంగా జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్, మెహరాన్‌గఢ్ కోట వంటి చారిత్రక స్థలాల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తారు. ఆమె ఈ వారసత్వాన్ని ఆధునిక సాంకేతికతతో కలిపి, పర్యాటకులకు అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తారు. శివరంజని తన కుటుంబానికి చెందిన ట్రస్ట్‌ల ద్వారా సామాజిక సేవలో పాల్గొంటారు. విద్య, ఆరోగ్యం, సాంస్కృతిక సంరక్షణ కోసం ఆమె కృషి చేస్తారు, అయితే దీనిని ఆడంబరం లేకుండా చేస్తారు. ఆమె చాలా లో ప్రొఫైల్‌ మెయింటెయిన్ చేస్తారు. సోషల్ మీడియా లేదా పబ్లిక్ ఈవెంట్‌లలో అరుదుగా కనిపిస్తారు. శివరంజని రాజ్యే ఒక ఆధునిక రాజకుమారి, ఆమె రాజ వైభవాన్ని కాదు కానీ సాంస్కృతిక వారసత్వం, సామాజిక బాధ్యతలను మేనేజ్‌ చేస్తూ సాదాసీదాగా జీవిస్తారు.

జోధ్‌పూర్ రాజవంశం మొత్తం ఆస్తుల విలువ దాదాపు 22,000 కోట్ల రూపాయలు. ఈ సంపదలో ప్రధాన భాగం ఉమైద్ భవన్ ప్యాలెస్, మెహరాన్‌గఢ్ కోట, నాగౌర్ కోట వంటి చారిత్రక ఆస్తుల నుండి వస్తుంది, ఇవి లగ్జరీ హోటళ్లు, మ్యూజియంలు, పర్యాటక కేంద్రాలుగా మార్చబడ్డాయి. శివరంజని రాజ్యే ఈ ఆస్తుల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తారు, ముఖ్యంగా ఉమైద్ భవన్ ప్యాలెస్‌ను టాటా గ్రూప్‌తో భాగస్వామ్యంతో లగ్జరీ హోటల్‌గా మార్చడంలో ఆమె దోహదం గణనీయమైనది. అయితే, ఈ ఆస్తులు ఆమె వ్యక్తిగత సంపద కాకుండా, జోధ్‌పూర్ రాజవంశం యొక్క మొత్తం సంపదలో భాగం.

శివరంజని జోధ్‌పూర్ రాజవంశం, రాఠోడ్ వంశానికి చెందినవారు. ఈ వంశం రాజస్థాన్‌లోని మార్వాడ్ ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది. ఆమె తండ్రి మహారాజా గజ్ సింగ్ II, 1952లో రాజవంశం అధికారికంగా అంతరించినప్పటికీ, కుటుంబ వారసత్వాన్ని సంరక్షిస్తూ, సామాజిక సేవల ద్వారా ప్రజలతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. శివరంజని 347 గదుల గల ప్యాలెస్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తారు. ఈ ప్యాలెస్ మూడు భాగాలుగా విభజించబడింది. ఒక భాగం రాజవంశం నివాసం, ఒక భాగం టాటా గ్రూప్ నిర్వహించే లగ్జరీ హోటల్, మరొక భాగం మ్యూజియం. శివరంజని ఈ వారసత్వాన్ని ఆధునిక పర్యాటక అవసరాలకు అనుగుణంగా నిర్వహిస్తారు. ఆమె జోధ్‌పూర్‌లోని స్థానిక సమాజంతో సన్నిహితంగా ఉంటారు. సామాన్య ప్రజలలా కలిసి మాట్లాడతారు. ఆమె సింప్లిసిటీని, స్థానికుల పట్ల ఆమెకున్న గౌరవాన్ని చూపిస్తుంది. కొన్ని సామాజిక కార్యక్రమాలు మహిళల సాధికారత, గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ehatv

ehatv

Next Story