నందమూరి బాలకృష్ణ(Nanadhamuri balakrishna) సినిమాల్లోకి వచ్చి చూస్తూ చూస్తూ 50 ఏళ్లు పూర్తయ్యాయి.

నందమూరి బాలకృష్ణ(Nanadhamuri balakrishna) సినిమాల్లోకి వచ్చి చూస్తూ చూస్తూ 50 ఏళ్లు పూర్తయ్యాయి. 50 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో, అదీ టాప్‌ రేంజ్‌లో ఉండటమన్నది మామూలు విషయం కాదు.. ఈ అరుదైన ఫీట్‌ను సొంతం చేసుకున్న బాలకృష్ణకు టాలీవుడ్‌కు(Tollywood) అపురూపమైన కానుకను ఇవ్వబోతున్నది. స్వర్ణోత్సవాన్ని భారీ స్థాయిలో నిర్వహించాలనుకుంది. సెప్టెంబర్‌ 1 తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఈ వేడుకకు అల్లు అర్జున్‌కు(Allu arjun) కూడా ఆహ్వానం అందింది. ఈ వేడులకు హాజరు కావాలంటూ టీఎఫ్‌పీసీ, టీఎఫ్‌సీసీ, మా అసోసియేషన్‌ సభ్యులు బన్నీని కలిసి ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవిని(Chiranjeevi) కూడా కలిసి వేడుకకు రావాల్సిందిగా విన్నవించుకున్నారు. చిరంజీవి కూడా సానుకూలంగా స్పందించారట! చిరంజీవి, అల్లు అర్జున్‌ ఆ వేడుకకు వస్తే మాత్రం అదిరిపోతుంది. ఇద్దరూ ఒక వేదిక మీదకు వస్తే అభిమానులకు కన్నుల పండుగే! వారు కోరుకుంటున్నది కూడా ఇదే!

Updated On
Eha Tv

Eha Tv

Next Story