ప్రముఖ సినీ గేయ రచయిత ఆరుద్ర భార్య ,ప్రఖ్యాత రచయిత్రి కే.రామలక్ష్మి హైదరాబాద్ మలక్ పేట్ లోని స్వగృహంలో కన్నుమూసారు. గతకొద్దీ కాలంగా అనారోగ్య సమస్యలతో భాదపడుతున్నారు రామలక్ష్మి . 1930 డిసెంబర్ 31 న కోటనందూరు జన్మించారు. 1951 నుండి ఆంగ్ల ,ఆంధ్ర సాహిత్యం ,ప్రాచీనాంధ్ర సాహిత్యంఅభ్యసించి రచనలు చేయటం ప్రారంబించారు . మద్రాస్ యూనివర్శిటీ లో బి.ఏ చదువుకున్నారామె . తెలుగు స్వతంత్రం లో ఇంగ్లీష్ విభాగానికి ఉపసంపాదకులుగా పనిచేసారు . "విడదీసే రైలు […]

arudra wife
ప్రముఖ సినీ గేయ రచయిత ఆరుద్ర భార్య ,ప్రఖ్యాత రచయిత్రి కే.రామలక్ష్మి హైదరాబాద్ మలక్ పేట్ లోని స్వగృహంలో కన్నుమూసారు. గతకొద్దీ కాలంగా అనారోగ్య సమస్యలతో భాదపడుతున్నారు రామలక్ష్మి . 1930 డిసెంబర్ 31 న కోటనందూరు జన్మించారు.
1951 నుండి ఆంగ్ల ,ఆంధ్ర సాహిత్యం ,ప్రాచీనాంధ్ర సాహిత్యంఅభ్యసించి రచనలు చేయటం ప్రారంబించారు . మద్రాస్ యూనివర్శిటీ లో బి.ఏ చదువుకున్నారామె . తెలుగు స్వతంత్రం లో ఇంగ్లీష్ విభాగానికి ఉపసంపాదకులుగా పనిచేసారు . "విడదీసే రైలు బళ్ళు" అనే రచన రామలక్ష్మి గారికి మంచి గుర్తింపు తెచ్చింది. ముక్కుసూటి వ్యక్తిత్వం. ఏదైనా దైర్యంగా ప్రశ్నించగల తెగువ ఆమె నైజం . ఎన్నో స్త్రీ సంక్షేమ సంస్థల్లో విధులు నిర్వహించారు .
1954 లో ఆరుద్ర ,రామలక్ష్మి దంపతులయ్యారు. వారిద్దరూ తెలుగు రచన ,సాహిత్య రంగంలో విశేష సేవలను అందించారు. అరుదైన ఆరుద్ర సాహిత్యం ఎన్నడూ మరువలేనిది .ఆరుద్ర కలం నుండి జాలువారిన పాట,సాహిత్యం,రచన ఏవైనా సరే విమర్శించే మొదటి మనిషి రామలక్ష్మి గారు . ఆరుద్ర "ఆంధ్ర సమగ్ర సాహిత్యం" లో అంకితమైన రోజుల్లో రామలక్ష్మి అన్ని వేళల ఆయన వెంట ఉండేవారట . వారి దాంపత్య జీవితంలో వచ్చిన తాగదలన్ని కూడా సాహిత్య పరంగా చేసుకునే విమర్శల వలెనే అట. వీరికి ముగ్గురు కుమార్తెలు .రామలక్ష్మి వయోభారంతో కన్నుమూశారు .


