Keerthi Bhat : ప్రైవేట్పార్ట్స్ను తాకేవారు… 200 ఇస్తా వస్తావా అని అడిగేవారు!
బుల్లితెర నటి కీర్తిభట్(Keerthi Bhat) బిగ్బాస్(Biggs Boss) షోతో పాపులరయ్యారు. బిగ్బాస్ ఆరో సీజన్లో పాల్గొన్న కీర్తి భట్ ఆ తర్వాత పలు సీరియల్స్లో(Serials) హీరోయిన్గా నటించారు. కన్నడ అమ్మాయి అయిన కీర్తిభట్ 2019లో మనసిచ్చి చూడు అనే సీరియల్తో తెలుగులో అడుగుపెట్టారు. మెగా సీరియస్ కార్తికదీపంలో కూడా నటించారు. 2022లో ప్రసారమైన రియాలిటీ షో బిగ్బాస్తో అందరినీ ఆకట్టుకున్నారు.
- Written By: Ehatv Published Date - Sat - 27 April 24
బుల్లితెర నటి కీర్తిభట్(Keerthi Bhat) బిగ్బాస్(Biggs Boss) షోతో పాపులరయ్యారు. బిగ్బాస్ ఆరో సీజన్లో పాల్గొన్న కీర్తి భట్ ఆ తర్వాత పలు సీరియల్స్లో(Serials) హీరోయిన్గా నటించారు. కన్నడ అమ్మాయి అయిన కీర్తిభట్ 2019లో మనసిచ్చి చూడు అనే సీరియల్తో తెలుగులో అడుగుపెట్టారు. మెగా సీరియస్ కార్తికదీపంలో కూడా నటించారు. 2022లో ప్రసారమైన రియాలిటీ షో బిగ్బాస్తో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె మధురానగరిలో నటిస్తున్నారు. 2017లో కీర్తి భట్ ప్రయాణిస్తున్న కారు పెను ప్రమాదానికి(Car accident) గురయ్యింది. ఆ ప్రమాదంలో ఈమె తల్లిదండ్రులు, అన్నావదినలు చనిపోయారు. కీర్తి భట్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చాలా కాలం ఉన్నారు. కొన్నాళ్లపాటు కోమాలోకి వెళ్లిపోయారు. పెను విషాదంలో ఉన్న కీర్తి భట్కు ఆ సమయంలో దారుణమైన అనుభవాలు ఎదురయ్యాయి. ఆ భయంకరమైన విషయాలను ఆమె స్వయంగా చెప్పుకొచ్చారు. ‘ప్రమాదంలో తల్లిదండ్రులను, అన్నవదినలను కోల్పోయిన తర్వాత నన్ను మంగళూరు తీసుకెళ్లారు. అక్కడే 35 రోజులు ఉండాల్సి వచ్చింది. అక్కడే చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నన్ను ఎక్కడెక్కడో తాకేవారు. స్పర్శ లేకపోయినా అది నాకు తెలిసేది. వారిని నెట్టేయడానికి నా బలం సరిపోయేది కాదు. కోలుకున్న తర్వాత అక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా వచ్చేశాను. ఎక్కడకైనా వెళ్లాలంటే డబ్బులు కావాలి. ఆటో వాళ్ల దగ్గరకి వెళ్లి అడిగితే రెండువందలు ఇస్తాను వస్తావా అని అడిగేవారు. సరే వస్తానని అనేదాన్ని. తర్వాత వాళ్ల ప్రవర్తన చూసి వారి ఉద్దేశం అర్థమయ్యేది’ అని కీర్తి భట్ ఆవేదనగా చెప్పారు. ఆమె ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. ఇటీవల తన ప్రియుడితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. త్వరలో వీరి పెళ్లి జరగబోతున్నది.
-
Ujiarpur : తొలి ఓటు మురిపెం… దున్నపోతుపై పోలింగ్ కేంద్రానికి…!
-
Attack In Rafa : గాజాలో ఆగని ఇజ్రాయెల్ దాడులు.. భారతీయుడు మృతి
-
Cotton In Stomach : కడుపులో దూది పెట్టి కుట్టేసిన డాక్టర్
-
Vijayawada High Way : నగరబాట పట్టిన జనం.. కిక్కిరిసిన మెట్రో రైళ్లు
-
Ramoji Rao : ఈయనెవరో గుర్తుపట్టారా? చిన్న హింట్.. తెలుగు రాష్ట్రాలలో ఫేమస్!
-
Lawyer Prashant Bhushan : 400 సీట్లు కాదు, 200 దాటితే మహా ఎక్కువ!
-
Karnataka : ప్రేతాత్మల పెళ్లి…. ఎక్కడో తెలుసా?