‘యశోద’ మూవీ తర్వాత సమంత రూమ్ ప్రభు చేస్తున్న చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై సమంత ఫ్యాన్స్‏తో పాటు కామన్ ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ చిత్రాన్ని మైథలాజికల్ డ్రామాగా దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించారు.

‘యశోద’ మూవీ తర్వాత సమంత రూమ్ ప్రభు చేస్తున్న చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై సమంత ఫ్యాన్స్‏తో పాటు కామన్ ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ చిత్రాన్ని మైథలాజికల్ డ్రామాగా దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించారు.

ఇందులో శాకుంతల క్యారెక్టర్‏ను సమంత చేయగా.. దుష్యంతుడి క్యారెక్టర్‏ను దేవ్ మోహన్ చేశాడు. మోహన్ బాబు, మధుబాల, గౌతమి ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. అయితే ఈ మూవీని చూసినట్టు సోషల్ మీడియా వేదికగా సమంత చెప్పింది. ‘‘మొత్తానికి నేను సినిమా చూశాను, మనసుకు హత్తుకునే ఒక అందమైన సినిమా అని, ఇది ఒక గొప్ప ఎపిక్ పిక్చర్ అని, మా ఫ్యామిలీ ఆడియన్స్‏ను ఫుల్ ఎమోషన్స్‏తో నింపేందుకు వెయిట్ చేయలేకపోతున్నా’’ అంటూ ఇన్‏స్టాలో పోస్ట్ పెట్టింది.

ఇక ఈ సినిమాకు ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా ‘శాకుంతలం’ మూవీ టీమ్ పెద్దమ్మతల్లి ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా అమ్మవారిని దర్శించుకున్న డైరెక్టర్ గుణశేఖర్, శమంత, దేవ్ మోహన్.

ఇక ఈ చిత్రాన్ని గుణశేఖర్ డైరెక్ట్ చేస్తుండగా డైలాగ్స్ సాయి మాధవ్ బుర్రా అందిస్తున్నారు. మ్యూజిక్ మణిశర్మ, సినిమాటోగ్రఫీ జోసెఫ్ వి. శేఖర్, ఎడిటర్ ప్రవీణ్ పుడి ఉన్నారు. ఈ చిత్రాన్ని నీలిమ గుణ ప్రొడ్యూస్ చేస్తుండగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా జాస్తి హేమంబర్, కో-ప్రొడ్యూసర్‏గా దిల్ రాజు ఉన్నారు. ఏప్రిల్ 14న ఈ చిత్రం విడుదలకానుంది.

Updated On 15 March 2023 5:52 AM GMT
Ehatv

Ehatv

Next Story