తెలుగు చిత్ర పరిశ్రమ వరుస విషాదాలతో కంటతడిపెడుతుంది. రీసెంట్ గా సీనియర్ నటి జమున కన్నుమూసిన విషయం మనకు తెలిసిందే. ఆ విషాదం నుంచి తేరుకోకముందే ఇండస్ట్రీకి మరో విషాదం వచ్చిపడింది. సీనియర్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ సాగర్ (70) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ట్రీమ్ మెంట్ తీసుకుంటూ హెల్త్ కండిషన్ సీరియస్ అవడంతో గురువారం ఆయన తుదిశ్వాస చేశారు. 1952లో గుంటూరులో సాగర్ జన్మించారు. కెరీర్ తొలినాళ్లలో ఆయన పలు చిత్రాలకు ఎడిటర్ గా, […]

తెలుగు చిత్ర పరిశ్రమ వరుస విషాదాలతో కంటతడిపెడుతుంది. రీసెంట్ గా సీనియర్ నటి జమున కన్నుమూసిన విషయం మనకు తెలిసిందే. ఆ విషాదం నుంచి తేరుకోకముందే ఇండస్ట్రీకి మరో విషాదం వచ్చిపడింది. సీనియర్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ సాగర్ (70) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ట్రీమ్ మెంట్ తీసుకుంటూ హెల్త్ కండిషన్ సీరియస్ అవడంతో గురువారం ఆయన తుదిశ్వాస చేశారు.

1952లో గుంటూరులో సాగర్ జన్మించారు. కెరీర్ తొలినాళ్లలో ఆయన పలు చిత్రాలకు ఎడిటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. సాగర్ 1983లో నరేష్-విజయశాంతిల ’రాకాసిలోయ’ సినిమాతో ఆయన డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

స్టువర్టుపురం దొంగలు చిత్రం ఆయనకు దర్శకుడిగా గుర్తింపు తీసుకొచ్చింది. ’అమ్మదొంగ, అన్వేషణ, ఓసి నా మరదలా వంటి సినిమాలు సాగర్ కు మంచి పేరు తెచ్చాయి. ఆయన దర్శకత్వంలో రిలీజైన రామసక్కనోడు మూవీకి మూడు నంది అవార్డులు వచ్చాయి. 2002లో ’ఖైదీ బ్రదర్స్’ చిత్రానికి ఆయన చివరిసారిగా డైరెక్షన్ చేశారు.

అంతేకాకుండా తెలుగు సినిమా దర్శకుల సంఘానికి కూడా ఆయన అధ్యక్షుడిగా పని చేశారు. సాగర్ మరణం ఇండస్ట్రీకి తీరనిలోటంటున్నారు. డైరెక్టర్ సాగర్ మృతిపట్ల ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Updated On 2 Feb 2023 1:47 AM GMT
Ehatv

Ehatv

Next Story