టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ ఆదివారం చెన్నైలో అనారోగ్యంతో క‌న్నుమూశారు. తెలుగులో విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ప‌లు విజ‌య‌వంత‌మైన సినిమాల్లో న‌టించాడు కాస్ట్యూమ్స్ కృష్ణ‌. నిర్మాత‌గా పెళ్లి పందిరి, అరుంధ‌తితో పాటు మ‌రికొన్ని సినిమాల్ని నిర్మించారు.

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ (costume krishna) ఆదివారం చెన్నైలో అనారోగ్యంతో క‌న్నుమూశారు. తెలుగులో విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ప‌లు విజ‌య‌వంత‌మైన సినిమాల్లో న‌టించాడు కాస్ట్యూమ్స్ కృష్ణ‌. నిర్మాత‌గా పెళ్లి పందిరి, అరుంధ‌తితో పాటు మ‌రికొన్ని సినిమాల్ని నిర్మించారు.

కాస్ట్యూమ్స్ కృష్ణ అస‌లు పేరు కృష్ణ మాదాసు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని ల‌క్క‌వ‌ర‌పు కోట‌లో జ‌న్మించారు. క్యాస్టూమ్ డిజైన‌ర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన కృష్ణ భార‌త్‌బంద్ సినిమా ద్వారా దివంగ‌త ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ ప్రోత్సాహంతో న‌టుడిగా మారారు. సీరియ‌స్ విల‌న్ రోల్స్‌లో త‌న‌దైన వ్యంగ్యం మేళ‌వించి డైలాగ్స్ చెప్ప‌డం కాస్ట్యూమ్స్ కృష్ణ ప్ర‌త్యేక‌త‌గా చెప్ప‌వ‌చ్చు.

అల్ల‌రి మొగుడు, పెళ్లం చెబితే వినాలి, కొండ‌ప‌ల్లి రాజా, మామా బాగున్నావా, విల‌న్‌, మా ఆయ‌న బంగారం, శాంభ‌వి ఐపీఎస్ తో పాటు ఎన్నో సినిమాల్లో డిఫ‌రెంట్ రోల్స్ చేశాడు. చిరంజీవి, వెంక‌టేష్, బాల‌కృష్ణ‌తో పాటు స్టార్ హీరోలంద‌రి సినిమాల‌కున‌టుడిగా, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా ప‌నిచేశారు.

ప్రొడ్యూస‌ర్‌గా పెళ్లిపంద‌రి, అరుంధ‌తి, మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాలితో పాటు మ‌రికొన్ని సినిమాల్ని నిర్మించారు. సినిమా నిర్మాణం వ‌ల్ల న‌ష్టాల పాలైన కాస్ట్యూమ్స్ కృష్ణ చాలా కాలంగా ఇండ‌స్ట్రీకి దూరంగా ఉన్నారు. కాస్ట్యూమ్స్ కృష్ణ మ‌ర‌ణంతో టాలీవుడ్‌లో విషాధ‌చాయ‌లు అలుముకున్నాయి.

Updated On 2 April 2023 1:21 AM GMT
Ehatv

Ehatv

Next Story