సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కళాతపస్వి మరణం నుంచి కోలుకోకముందే ఇంకో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సింగర్ వాణీ జయరామ్ (78) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 1945 నవంబర్ 30న తమిళనాడులోని వేలూరులో జన్మించిన వాణి జయరామ్ తెలుగు, తమిళం సహా పలు భాషల్లో 20 వేలు పైగా పాటలు పాడారు. 1000 సినిమాలకుపైగా ప్లే బ్యాక్ సింగర్ గానూ ఉన్నారు. ఆమె 8వ ఏటనే ఆలిండియా […]

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కళాతపస్వి మరణం నుంచి కోలుకోకముందే ఇంకో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సింగర్ వాణీ జయరామ్ (78) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.

1945 నవంబర్ 30న తమిళనాడులోని వేలూరులో జన్మించిన వాణి జయరామ్ తెలుగు, తమిళం సహా పలు భాషల్లో 20 వేలు పైగా పాటలు పాడారు. 1000 సినిమాలకుపైగా ప్లే బ్యాక్ సింగర్ గానూ ఉన్నారు. ఆమె 8వ ఏటనే ఆలిండియా రేడియోలో పాటపాడి అబ్బురపడిచిన బాల మేధావి ఆమె. హిందీ మూవీ గుడ్డి తో సినీ సంగీత ప్రపంచంలోకి ఆమె అడుగుపెట్టారు.

మొదట్లో కర్నాటక, హిందుస్తానీ సంగీతం నేర్చుకున్నారు. ఆ తర్వాత వాణి తన పాటలతో అందరినీ ఆకట్టుకుంది. కేవలం సినిమా సాంగ్సే కాకుండా వేలల్లో భక్తి పాటలను కూడా పాడారు, ఆమె గాన ప్రతిభకు గుర్తించిన కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. అయితే ఈ అవార్డును అందుకోకుండానే ఆమె ఈలోకాన్ని విడిచివెళ్లిపోయారు.

వాణి జయరామ్ పాటలు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఎవర్ గ్రీనే. ఆమె పాటలతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. వాణి సడన్ గా చనిపోవడం అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

Updated On 4 Feb 2023 6:40 AM GMT
Ehatv

Ehatv

Next Story