బీహార్‌లోని జెహనాబాద్ జిల్లాలో ఒక ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు సహా ఏడుగురు మరణించగా, తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు

బీహార్‌లోని జెహనాబాద్ జిల్లాలో ఒక ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు సహా ఏడుగురు మరణించగా, తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని మఖ్దుంపూర్‌లోని బాబా సిద్ధనాథ్ ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నివేదికల ప్రకారం.. పవిత్ర సావన్ మాసం నాల్గవ సోమవారం కావడంతో.. ఆలయంలో విపరీతమైన రద్దీ ఉంది. భారీ రద్దీ తొక్కిసలాటకు దారితీసింది. దీని ఫలితంగా ప‌లువురు మరణించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

జెహనాబాద్ జిల్లా మఖ్దుంపూర్‌లోని బాబా సిద్ధనాథ్ ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మరణించారు. తొమ్మిది మంది గాయపడ్డారు. మేము ప‌రిస్థితుల‌ను పర్యవేక్షిస్తున్నాము. ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉందని జెహనాబాద్ డీఎం అలంకృత పాండే మీడియా సంస్థ ఏఎన్ఐతో అన్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల నివేదికలు అందాల్సి ఉంది.

Updated On
Sreedhar Rao

Sreedhar Rao

Next Story