గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగింది.

గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి మ.1.15కి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం (ఫ్లైట్ AI171) టేకాఫ్ సమయంలో మేఘానీనగర్ ప్రాంతంలో కూలిపోయింది. ఈ విమానంలో 12 మంది సిబ్బంది సహా 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం తర్వాత విమానం మంటల్లో చిక్కుకుని, దట్టమైన కమ్ముకుంది. టేకాఫ్ సమయంలో విమానం వెనుక భాగం ఒక చెట్టుతో ఢీకొని ఉండవచ్చని సమాచారం. ఈ విమానంలో మాజీ సీఎం విజయ్ రూపాని (Vijay Rupani)కూడా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్(Bhupendra Patel), రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘవీ, అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్తో మాట్లాడారు. కుట్ర కోణం ఉందా అని అనుమానిస్తున్నారు.
