ఖలిస్థానీ నేత, వారిస్‌ పంజాబ్‌ దే నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌ లోక్‌సభ ఎన్నికల్లో

ఖలిస్థానీ నేత, వారిస్‌ పంజాబ్‌ దే నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌ లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాడు. పంజాబ్‌లోని ఖదూర్ సాహెబ్ స్థానం నుంచి గెలుపొందాడు. ఏకంగా 1,97,120 పైగా ఓట్ల తేడాతో ఎంపీగా గెలిచాడు. అమృత్‌పాల్‌ ప్రస్తుతం జాతీయ భద్రతా చట్టం కింద అస్సాంలోని డిబ్రూగఢ్‌ జైల్లో ఉన్నాడు. ‘వారిస్‌ పంజాబ్‌ దే’ సంస్థ వ్యవస్థాపకుడు దీప్‌సిద్ధూ మరణంతో అమృత్‌పాల్‌ ఆ సంస్థకు తానే నాయకుడినని ప్రకటించుకున్నాడు. అమృత్ పాల్ సింగ్ తల్లిదండ్రులు తమ కొడుకును బయటకు తీసుకుని రావడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. పార్లమెంటు సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు వీలుగా అమృత్‌పాల్‌ సింగ్‌ ను విడుదల చేయాలని కోరుతున్నారు. అతడిని పెరోల్ మీద బయటకు తీసుకుని రావడానికి దరఖాస్తు దాఖలు చేశారు. డిబ్రూఘర్‌లోని సెంట్రల్ జైలులో ఉన్న తమ కొడుకును కలవడానికి అతని తల్లిదండ్రులు ఇటీవలే వెళ్లారు.

రాజ్యాంగం ప్రకారం కొత్తగా ఎన్నికైన పార్లమెంటు సభ్యులందరూ (MP) ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. అందుకే అమృత్‌పాల్ సింగ్‌ విషయంలో కూడా తాత్కాలిక విడుదల లేదా పెరోల్ కోసం దరఖాస్తును దాఖలు చేసింది అతడి కుటుంబం. అతనిని విడుదల చేయాలంటూ స్థానిక జిల్లా మేజిస్ట్రేట్ (DM) ను కోరారు. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, స్థానిక జిల్లా మేజిస్ట్రేట్ సూచనను అనుసరించి జైలు అధికారులు అమృత్‌పాల్ సింగ్‌ అభ్యర్థనను ఆమోదించవలసి ఉంటుంది.

Updated On 9 Jun 2024 6:45 AM GMT
Yagnik

Yagnik

Next Story