జ్యోతిష్యంతో 58 మంది మహిళలకు గాలం , వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్..!

తన దగ్గరికి సమస్యల కోసం వచ్చేవాళ్లకు మాయ మాటలు చెప్పి మహిళలను లొంగదీసుకున్నాడు. వారితో గడిపిన సమయాన్ని వీడియోలు తీశాడు. వాటితో బ్లాక్‌ మెయిల్‌కు దిగాడు. ఈ కేసులో రిటైర్డ్ మ‌ర్చెంట్ నేవీ ఆఫీస‌ర్‌ను మ‌హారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత‌న్ని అశోక్ ఖార‌త్‌గా గుర్తించారు. అత‌నో జ్యోతిష్యుడు కూడా. ఓ 35 ఏళ్ల మ‌హిళను లైంగికంగా వేధించిన కేసులో అత‌ను పోలీసుల‌కు చిక్కాడు. ఆధ్యాత్మికత‌ పేరుతో అత‌ను త‌న అకృత్యాల‌ను కొన‌సాగించాడు.అశోక్ ఖార‌త్ వ‌య‌సు 67 ఏళ్లు. పూజ‌లు చేస్తాన‌ని చెప్పి 35 ఏళ్ల మ‌హిళ‌ను వ‌శ‌ప‌రుచుకున్నాడు. ఆమెకు మ‌త్తు మందు ఇచ్చి.. హిప్నటైజ్‌ చేశాడు. ఆ త‌ర్వాత శారీర‌కంగా ఆమెపై దాడి చేశాడు. మూడేళ్లుగా వేద‌న అనుభ‌వించిన ఆ మ‌హిళ చివ‌ర‌కు పోలీసుల్ని ఆశ్రయించింది. కేసును చేధించిన పోలీసుల‌కు మైండ్ బ్లాక్ అయ్యింది. కేవ‌లం ఒక్క మ‌హిళే కాదు.. ఆ ఆస్ట్రాల‌జ‌ర్ ఉచ్చులో అనేక మంది మ‌హిళ‌లు బ‌లైన‌ట్లు గుర్తించారు.

వ్యక్తిగత సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి ఆడ‌వాళ్లను త‌న ఆఫీసుకు రావాల‌ని పిలిచేవాడు. వెళ్లిన మ‌హిళ‌ల‌ను హిప్నటైజ్ చేసేవాడు. మ‌త్తు ఇచ్చి ఆ ప‌ని చేసేవాడని పోలీసులు చెప్పారు. ఆ మ‌హిళ‌ల‌ను భ‌య‌పెట్టి వారిని రేప్ చేసేవాడ‌ని తెలిసింది. భర్తలను చంపేస్తాన‌ని లేదంటే.. చేత‌బ‌డి పూజ‌ల‌తో వ‌ణుకు పుట్టించేవాడు. ఫాంహౌస్‌ వేదిక‌గా ఈ అకృత్యాల‌కు పాల్పడ్డాడు. అయితే అత‌ని ఆఫీసులో సీసీకెమెరాల‌ను ఇన్‌స్టాల్ చేశాడు. ఆఫీసు నుంచి ఓ పెన్‌డ్రైవ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో చాలా మంది మ‌హిళ‌ల‌తో శృంగారం చేసిన‌ట్లు ఆధారాలు ఉన్నాయి. సుమారు 58 మంది మ‌హిళ‌ల‌తో ఉన్న వీడియో క్లిప్‌ల‌ను గుర్తించారు

Updated On
ehatv

ehatv

Next Story