కేరళ రాష్ట్రం త్రిచూర్లోని(kerala District)ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నుంచి రూ.20 కోట్లతో(20cross)ఓ ఉద్యోగి పరారైంది.

కేరళ రాష్ట్రం త్రిచూర్లోని(kerala District)ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నుంచి రూ.20 కోట్లతో(20cross)ఓ ఉద్యోగి పరారైంది. వలపాడ్ అనే ఫైనాన్స్ సంస్థలో(valapad finance)గత 18 ఏళ్లుగా అసిస్టెంట్ జనర్ మేనేజర్గా ధన్యమోహన్(dhanyamohan)అనే ఉద్యోగి పనిచేస్తోంది. వలపాడ్ అనే సంస్థ చాలా మందికి వివిధ రకాలైన లోన్లు ఇస్తుంది. వాటికి వడ్డీలు చెల్లిస్తోంది. అయితే సంస్థలో సరిగా ఆడిట్(audit)జరగడం లేదని గమనించిన ధన్యమోహన్ సంస్థలో ఉన్న నగదుపై కన్నేసింది. ఎలాగైనా డబ్బుకొట్టేయాలని ప్లాన్ వేసింది. అందుకు గాను పెద్ద స్కెచ్చే వేసింది. 2019 నుంచి ధన్య.. ఆన్లైన్లో పర్సనల్ లోన్ అకౌంట్లు క్రియేట్ చేయడం మొదలు పెట్టింది. తన తండ్రి, సోదరుడు, బంధువులు, స్నేహితులు.. ఇలా తెలిసినవారి పేర్లపై రకరాకల అకౌంట్లను క్రియేట్ చేసి, డబ్బును వారి బ్యాంక్ అకౌంట్లకు(bankaccount)పంపించింది.
సంస్థ వారికి లోన్లు ఇచ్చినట్లుగా చూపుతుంది. కానీ వాటిని మళ్లీ తిరిగి చెల్లించరు. వాటిపై వడ్డీ కూడా సంస్థకు తిరిగిరాదు. సంస్థలో డబ్బు నిల్వతగ్గిపోవడంతో ఇంటర్నల్ ఆడిట్ నిర్వహించారు. ఇది తెలుసుకున్న తనకు అనారోగ్యం వచ్చిందని సంస్థకు సెలవు పెట్టింది. సీనియర్ ఉద్యోగి కావడంతో సెలవుపై ధన్యను వెళ్లనిచ్చారు. ఆ తర్వాత ధన్య ఫోన్ స్విచాఫ్ చేసుకుంది. ధన్య కోసం ఆరా తీయగా ఆమె పరారైనట్లు తెలిసింది. కుటుంబసభ్యులు కూడా ఎవరూ లేరు. అక్రమ డబ్బుతో ధన్య విలాసవంతమైన వస్తువులు కొన్నది, భూమి, ఇల్లు(land,house)కొనుక్కుందని తెలిసింది. సంస్థలో అవకతవకలకు ధన్య పాల్పడిందని తేలడంతో ఆమెపై సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంస్థ నిర్వాహకులు మాత్రం రూ.20 కోట్లు పోగొట్టుకొని లబోదిబోమంటున్నారు. అసిస్టెంట్ జనరల్ మేనేజరే అని నమ్మితే రూ.20 కోట్లకు ఎసరు పెట్టిందని వాపోతున్నారు.


