బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4, 2025న జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా సంభవించిన తొక్కిసలాటలో

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4, 2025న జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా సంభవించిన తొక్కిసలాటలో ఉత్తర కన్నడ(Kannada) జిల్లాకు చెందిన అక్షత(Akshata) పై (27) దురదృష్టవశాత్తూ మరణించారు. అక్షత, చార్టర్డ్ అకౌంటెన్సీ (CA) పరీక్షలో గోల్డ్ మెడల్( Gold Medalist) సాధించిన ప్రతిభావంతురాలు, ఒకటిన్నర సంవత్సరాల క్రితం అక్షయ్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు విరాట్ కోహ్లీకి వీరాభిమానులు కావడంతో, RCB ఇన్‌స్టాగ్రామ్‌లో విజయోత్సవ పరేడ్ గురించి పోస్ట్ చూసి, అక్షత హాఫ్ డే సెలవు తీసుకుని చిన్నస్వామి స్టేడియాని(Chinnaswamy Stadium)కి వెళ్లారు. అయితే, అక్షత స్టేడియం గేట్ల వద్ద జరిగిన తీవ్రమైన తొక్కిసలాటలో చిక్కుకుని దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మొత్తం 11 మంది మరణించగా, 33 మంది గాయపడ్డారు. ఈ విషాదం అక్షత కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. RCB ఆర్థిక సాయంగా మరణించినవారి కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది మరియు గాయపడినవారి కోసం ‘RCB Cares’ పేరిట రిలీఫ్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.

ehatv

ehatv

Next Story