Karnataka Polls: కర్నాటకలో ఎన్నికలు వస్తే ఫలితాలు కిందా మీదే.. కాంగ్రెస్‌ కల్లాసే..!

కర్నాటకలో పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, కొడెమో టెక్నాలజీస్ కలిసి 2025 ఏప్రిల్ 17 నుంచి మే 18 వరకు కర్ణాటకలో నిర్వహించిన "పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్" ట్రాకర్ పోల్ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెలుపడ్డాయి. కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలుండగా, మెజార్టీకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 113. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఈ రోజు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ 51 శాతం ఓట్లతో 136-159 స్థానాలు, కాంగ్రెస్ 40.3 శాతం ఓట్లతో 62-82 స్థానాలు, జేడీ(ఎస్) 5 శాతం ఓట్లతో 3-6 స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయని వెల్లడైంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ 10.7 ఓట్ల శాతం స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది. 10,481 శాంపిల్స్‌తో రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు సర్వే నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్‌పై 10.7% ఓటు షేర్ ఆధిక్యతతో ముందంజలో ఉంది. రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ప్రశ్నించినప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు 29.2 శాతం మద్దతు ఇస్తుండగా, ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ కు 10.7 శాతం, జేడీ(ఎస్) నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామికి 7.6 శాతం, బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి బీ.ఎస్.యడియురప్పకు 5.5 శాతం, కర్ణాటక బీజేపీ అధ్యక్షులు బీ.వై. విజయేంద్రకు 5.2 శాతం ప్రజలు మద్దతు ఇస్తున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది.

ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై గట్టి యాంటీ-ఇన్‌కంబెన్సీ ఉంది. 1985 నుంచి కర్ణాటకలో ఏ అధికార పార్టీ కూడా తదుపరి ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించలేదని, ఈ ట్రెండ్ ఇప్పుడు కూడా కొనసాగవచ్చని సర్వే సూచిస్తోంది. హామీలు నెరవేర్చకపోవడం, సిద్ధరామయ్య-డి.కె. శివకుమార్ మధ్య అంతర్గత గొడవలు, ముడా స్కామ్, వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ వంటి అవినీతి ఆరోపణలు, ధరల పెరుగుదల, పన్నులు, శాంతిభద్రతల సమస్యలు కాంగ్రెస్‌పై అసంతృప్తికి కారణాలు అన్నట్లు తెలుస్తోంది. ఈ అసంతృప్తిని బీజేపీ ఉపయోగించుకుని, అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వే తెలిపింది.

ehatv

ehatv

Next Story