Boy suicide: "అమ్మా.. నేను చిప్స్ దొంగలించలేదు" అంటూ సూసైడ్ నోట్ రాసి బాలుడి ఆత్మహత్య

దొంగతనం నింద తట్టుకోలేక 7వ తరగతి చదువుతున్న బాలుడి ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఈస్ట్ మేదినిపూర్ నగరానికి చెందిన కృష్ణనెందు దాస్ (13) బాలుడు బకుల్దా అనే పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. అదే ప్రాంతంలోని ఒక స్వీట్ షాపు నుంచి ఓనర్ లేనప్పుడు మూడు చిప్స్ ప్యాకెట్లను తీసుకొని వెళ్ళిన బాలుడు. ఇది గమనించిన షాపు ఓనర్ నిలదీయడంతో, డబ్బులు చెల్లించిన బాలుడు. డబ్బులు చెల్లించినా కూడా వినకుండా బాలుడిని షాపు వద్దకు తీసుకెళ్లి కొట్టి అందరిముందు క్షమాపణ చెప్పించిన షాపు ఓనర్. జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పగా, షాపు వద్దకు వెళ్లి ఓనర్ తో బాలుడి తల్లి గొడవపెట్టుకుంది. ఇంటికి వెళ్ళిన తరువాత ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. షాపు ఓనర్ క్రూరమైన ప్రవర్తన వల్లే తమ కుమారుడు చనిపోయాడని ఆరోపించిన బాలుడి తల్లిదండ్రులు
