Brain-dead woman…!బ్రెయిన్-డెడ్ మహిళ.. అంబులెన్స్‌లో ‘భారీ కుదుపు’తో తిరిగివచ్చిన ప్రాణం!

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. బ్రెయిన్-డెడ్ అయినట్లు భావించి, ఆశలు వదులుకుని ఇంటికి తీసుకెళ్తున్న ఒక మహిళ, అంబులెన్స్ ప్రయాణంలో తగిలిన ఒక భారీ కుదుపు వల్ల తిరిగి స్పృహలోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్‌ పిలిభిత్ జిల్లాకు చెందిన బింజా కున్వర్. ఆమె స్థానిక జిల్లా కోర్టులో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ​సంఘటన: ఫిబ్రవరి 22న ఇంట్లో పని చేసుకుంటుండగా ఆమె అకస్మాత్తుగా కింద పడిపోయారు. మెరుగైన చికిత్స కోసం బరేలీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినప్పటికీ, ఆమె కోలుకునే అవకాశాలు లేవని, బ్రెయిన్-డెడ్ అయిందని వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 24న అంబులెన్సులో ఇంటికి తీసుకెళ్తుండగా, బరేలీ-హరిద్వార్ జాతీయ రహదారిపై ఒక భారీ గుంత కారణంగా వాహనం గట్టిగా కుదుపునకు గురైంది. ఆ వెంటనే అపస్మారక స్థితిలో ఉన్న ఆమె ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడం ప్రారంభించి, కళ్లు తెరిచారు. వెంటనే ఆమెను తిరిగి ఆసుపత్రికి తరలించారు. ఆమె శరీరంలో విషపూరిత అంశాలు ఏవైనా ఉన్నాయేమో అని పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు. దాదాపు 12 రోజుల చికిత్స తర్వాత ఆమె ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. ​ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Updated On
ehatv

ehatv

Next Story