✕
పెళ్లయిన నెల రోజులకే ప్రియుడితో వెళ్లిపోయిన వధువు, బ్రతికిపోయానని సంబరపడుతున్న వరుడు.

x
పెళ్లయిన నెల రోజులకే ప్రియుడితో వెళ్లిపోయిన వధువు, బ్రతికిపోయానని సంబరపడుతున్న వరుడు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) బుదౌన్ ప్రాంతానికి చెందిన సునీల్ అనే యువకుడికి గత నెల 17వ తేదీన వివాహం జరగగా, 9 రోజుల తరువాత పుట్టింటికి నవ వధువు వెళ్లింది. పుట్టింటికి వెళ్లి అక్కడినుండే ప్రియుడితో యువతి పరారైంది. ఈ విషయం తెలుసుకొని ఆమెను ప్రియుడితో ఉండడానికి వరుడు అంగీకరించాడు. నైనిటాల్కు హనీమూన్ వెళ్లడానికి ప్లాన్ చేశానని, మరో 'రాజా రఘువంశీ'గా మారి నా జీవితం నాశనం కాకుండా బ్రతికి బయటపడినందుకు సంతోషిస్తున్నానని పేర్కొన్న యువకుడు. ఈ సందర్భంగా ఈ మధ్య కాలంలో హనీమూన్ పేరుతో తీసుకెళ్లి ప్రియుడితో భర్తను చంపించిన ఘటనను గుర్తుచేసుకున్నాడు వరుడు.

ehatv
Next Story