కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం.. మన్మోహన్ అంత్యక్రియలు జరిగే రోజు ఒకటే అవడం యాదృచ్ఛికమే.

1885 వ సంవత్సరం డిసెంబర్ 28 న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. ప్రతి సంవత్సరం ఈ రోజున దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అవతరణ దినోత్సవ సంబరాలు నిర్వహిస్తాయి. పార్టీ కార్యాలయాల్లో పలు కార్యక్రమాలు, సభలు నిర్వహిస్తారు. అయితే ఈ సారి మాత్రం అన్ని కార్యక్రమాలు ఆగిపోయాయి.

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణానంతరం, ఆయన భౌతకకాయాన్ని ఈ రోజు AICC కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడికి కాంగ్రెస్ ముఖ్య నేతలు అందరూ చేరుకుని ఆయనకు నివాళులు అందిస్తున్నారు. ఈ రోజు నిఘం బోధ్ ఘాట్ లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

అయితే మన్మోహన్ సింగ్ మరణానికి, సంతాపంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆవిర్భావ కార్యక్రమాలను రద్దు చేసింది. వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది.

Updated On
ehatv

ehatv

Next Story