DA hike as a Holi gift: హోలీ కానుకగా డీఏ పెంపు? ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్..!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మార్చి 4 వచ్చే హోలీ కానుకగా డీఏ పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం DA 58% ఉండగా మరో 2% పెరగొచ్చని అంచనా. ఇది జనవరి నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 2000 సంవత్సరంలో ఒక శాతం డీఏ పెరగ్గా, ఈ ఏడాది పెంపు రెండో అత్యల్పం అవుతుంది. 2007, 2018, 2025లోనూ రెండు శాతమే నమోదైంది. కాగా 8వ వేతన సంఘం ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.
డీఏ పెరిగితే దానికి అనుగుణంగా ఉద్యోగికి బై హ్యాండ్ అందే వేతనం కూడా పెరుగుతుంది. ఇది బేసిక్ పేపై పెరుగుతుందని చెప్పొచ్చు. ఆల్ ఇండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియర్ వర్కర్స్ ఆధారంగా డీఏ, డీఆర్ పెంపును నిర్ణయిస్తారు. డీఏ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు.. డీఆర్ పెన్షనర్లకు వర్తిస్తుంది. డిసెంబరులో ఏఐసీపీఐ- ఐడబ్ల్యూ 148.2 వద్ద ఉంది. ఈ లెక్కన డీఏ ఈసారి కేవలం 2 శాతం వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ప్రస్తుతం డీఏ, డీఆర్ 58 శాతంగా ఉండగా.. ఇది 60 శాతానికి చేరుతుందని చెప్పొచ్చు


