27 ఏళ్ల ఐటీ ఉద్యోగి చివరిఫోన్‌ విని తట్టుకోలేని తండ్రి గుండె..!

నాన్న నేను నీటిలో మునిగిపోతున్నా.. నన్ను వచ్చి దయచేసి త్వరగా వచ్చి కాపాడు.. నాకు చనిపోవాలని లేదు నాన్న.. అని తండ్రికి ఫోన్‌ చేసి తాను ప్రమాదంలో ఉన్నానని చెప్పినా కానీ ఆ తండ్రి నిస్సహాయంగా మిగిలిపోయాడు. వివరాల్లోకి వెళ్తే..! ఢిల్లీలోని నోయిడా ప్రాంతానికి చెందిన యువరాజ్‌ మొహతా (27) ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎప్పటిలాగే శనివారం విధులు ముగించుకుని కారులో తన ఇంటికి బయలు దేరాడు. సరిగ్గా నోయిడా సెక్టార్‌ 150 వద్ద తీవ్రంగా మంచు కురుస్తోంది. తీవ్రంగా మంచు ఉండడంతో రహదారి కనపడలేదు. ఎక్కడా సైన్‌ బోర్డులు కానీ వార్నింగ్‌ బోర్డులు కానీ లేవు. అయినా సరే మెల్లగా ఇంటికి వెళ్లొచ్చే అనే ధీమాతో ముందుకెళ్లాడు. సరిగ్గా అలాంటి సమయంలో ఊహించని విధంగా మృత్యువు ముంచుకొచ్చింది. ఫలితంగా 70 అడుగుల లోతులో యువరాజ్‌ కారు పడిపోయింది. ఎదో ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నానని అర్ధం చేసుకున్న యువరాజు.. ప్లీజ్‌ హెల్ప్ మీ.. ప్లీజ్‌ సేవ్‌ మీ అని కేకలు వేశాడు. లాభం లేకపోయింది. అసలే చిమ్మ చీకటి. ఏం జరిగిందే అర్ధం కాని పరిస్థితి. వెంటనే ఆ టెకీ తన తండ్రి రాజ్‌కుమార్ మెహతాకు ఫోన్ చేశాడు. ‘నాన్న, నేను నీటితో నిండిన లోతైన గుంతలో పడిపోయాను. నేను మునిగిపోతున్నాను. దయచేసి వచ్చి నన్ను కాపాడండి. నేను చనిపోవాలనుకోవడం లేదు’అని భయం చేశాడు..

కొడుకు ఫోన్‌ కా​ల్‌తో హతాశుడైన రాజ్‌ కుమార్‌ మెహతా పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు,ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రాజ్‌ కుమార్‌ సైతం ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చాడు. సుమారు ఐదుగంటల పాటు శ్రమించి 70 అడుగుల లోతులో పడిన కారును అందులో చిక్కుకున్న యువరాజ్‌ను వెలికి తీశారు. కానీ యువరాజ్‌ ప్రాణాలు మాత్రం దక్కలేదు. అప్పటికే ఊపిరాడక యువరాజ్‌ మరణించినట్లు వైద్యులు తెలిపారు. కుమారుడి మరణంపై రాజ్‌కుమార్‌ మెహతా ప్రభుత్వ అధికారులపై ఆరోపణలు గుప్పించారు. ఎలాంటి ప్రమాదపు హెచ్చరిక బోర్డులు లేనందు వల్లే తన కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతనికి మద్దతుగా స్థానికులు సైతం ఆందోళన చేపట్టారు

Updated On
ehatv

ehatv

Next Story