దేశంలో అనైతిక వ్యాపారాలకు పాల్పడే సంస్థలపై దాడులు చేసి, వారిని కటకటాల్లోకి నెట్టే ఎన్‌ఫోర్స్‌ డైరెక్టరేట్‌లో కూడా అవినీతి అధికారులు ఉన్నారనడానికి ఈ ఉదంతమే ఉదాహరణ.

దేశంలో అనైతిక వ్యాపారాలకు పాల్పడే సంస్థలపై దాడులు చేసి, వారిని కటకటాల్లోకి నెట్టే ఎన్‌ఫోర్స్‌ డైరెక్టరేట్‌లో కూడా అవినీతి అధికారులు ఉన్నారనడానికి ఈ ఉదంతమే ఉదాహరణ. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ పట్టణంలో ఈడీ డిప్యూటీ డైరెక్టర్ (ED Deputy Director)గా విధులు నిర్వహిస్తూ, అక్రమ మైనింగ్ చేస్తున్న ఒక వ్యాపారవేతపై ఈడీ దాడులు చేసిన చింతన్ రఘువంశి(Chintan Raghuvanshi) IRS. ఈడీ కేసు నుండి వ్యాపారవేత్తను తప్పించేందుకు రూ.50 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఈడీ డిప్యూటీ డైరెక్టర్ రఘువంశి. ఈడీ డైరెక్టర్ లంచం అడుగుతున్నాడని సీబీఐ(CBI)కి సమాచారం ఇచ్చిన వ్యాపారవేత్త. లంచం తీసుకుంటుండగా దాడి చేసి, ఈడీ డిప్యూటీ డైరెక్టర్ రఘువంశిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సీబీఐ అధికారులు

చింతన్ రఘువంశి, 2013 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఐఆర్‌ఎస్‌ అధికారి, ఒడిశా భువనేశ్వర్‌(Bhubaneswar)లోని ED జోనల్ ఆఫీస్ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.అతను భువనేశ్వర్‌కు చెందిన ఒక మైనింగ్ వ్యాపారి, రతికాంత రౌత్‌పై నడుస్తున్న మనీ లాండరింగ్ కేసు(Money laundering Case) నుంచి తప్పించడానికి రూ. 50 లక్షల లంచం డిమాండ్ చేశాడు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఒక ట్రాప్ ఆపరేషన్ నిర్వహించి, చింతన్ రఘువంశి రూ. 20 లక్షల మొదటి లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అతను మొదట రూ. 5 కోట్లు డిమాండ్ చేసి, తర్వాత రూ. 2 కోట్లకు తగ్గించాడని, ఆ తర్వాత రూ. 50 లక్షలకు అంగీకరించాడని తెలుస్తోంది. వ్యాపారి రతికాంత రౌత్ (RatikantaRout)డెంకనాల్‌లో స్టోన్ మైనింగ్ వ్యాపారం చేస్తాడు. ఈ లంచం డిమాండ్ గురించి CBIకి ఫిర్యాదు చేశాడు. భువనేశ్వర్‌లోని షహీద్ నగర్ ప్రాంతంలో,చింతన్ ఓ హోటల్‌లో రూ. 20 లక్షలు తీసుకుంటూ ఉండగా సీబీఐ బృందం అతన్ని అరెస్ట్ చేసింది. చింతన్ రఘువంశి ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు, మరిన్ని విచారణలు జరుగుతున్నాయి. ఈ కేసు ఒడిశాలో అవినీతిపై దృష్టి సారించింది, EDలో అవినీతి ఆరోపణలపై చర్చను రేకెత్తించింది.

ehatv

ehatv

Next Story