విరాట్ కోహ్లీకి సంబంధించిన బెంగళూరు(Bengaluru)లోని పబ్, రెస్టారెంట్ అయిన One8 Communeపై కేసు నమోదైంది.

విరాట్ కోహ్లీకి సంబంధించిన బెంగళూరు(Bengaluru)లోని పబ్, రెస్టారెంట్ అయిన One8 Communeపై కేసు నమోదైంది. సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్(COTPA Act) నిబంధనలను ఉల్లంఘించినందుకు. ఈ రెస్టారెంట్‌లో ధూమపానం కోసం నిర్దేశిత ప్రాంతం లేకపోవడం వల్ల కబ్బన్ పార్క్ పోలీసులు(Cubbon Park Police) స్వయంగా కేసు నమోదు చేశారు. బెంగళూరు సిటీ పోలీసులు ధూమపాన నిబంధనలను అమలు చేయడానికి చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా జరిగింది. ఇది One8 Communeపై మొదటి కేసు కాదు. 2024 జూలైలో కూడా ఈ పబ్‌పై, రాత్రి 1 గంటల తర్వాత కూడా తెరిచి ఉండి, గట్టిగా సంగీతం వాయించడం వల్ల శబ్ద కాలుష్య ఫిర్యాదుల కారణంగా కేసు నమోదైంది. విరాట్ కోహ్లీ (Virat Kohli)యాజమాన్యంలోని పబ్‌పై COTPA నిబంధనల ఉల్లంఘన కారణంగా కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. విరాట్ కోహ్లీ వ్యక్తిగతంగా చేసిన తప్పిదం కాదు, అతని రెస్టారెంట్ నిర్వహణకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘనకు సంబంధించినది. ఈ సంఘటన బెంగళూరులో పబ్‌లు, రెస్టారెంట్లలో ధూమపాన నిబంధనల అమలుపై దృష్టి పెట్టేలా చేసింది.

ehatv

ehatv

Next Story