హర్యానాలోని(Haryana) భివానీ జిల్లాలో 12వ తరగతి విద్యార్థుల(Inter students) బృందం తమ మహిళా సైన్స్ టీచర్(science teacher) కుర్చీకింద బాణసంచా(Fire works) లాంటి బాంబును అమర్చి పేల్చారు

హర్యానాలోని(Haryana) భివానీ జిల్లాలో 12వ తరగతి విద్యార్థుల(Inter students) బృందం తమ మహిళా సైన్స్ టీచర్(science teacher) కుర్చీకింద బాణసంచా(Fire works) లాంటి బాంబును అమర్చి పేల్చారు. గత వారం విద్యార్థులను ఉపాధ్యాయురాలు మందలించడంతో విద్యార్థులు గత వారం ఈ చర్యకు పాల్పడ్డారు. దీంతో 13 మంది విద్యార్థిలపై హర్యానా విద్యాశాఖ వారం రోజుల పాటు సస్పెండ్(Suspend) చేసింది. విద్యార్థుల్లో ఒకరు క్రాకర్‌లాంటి బాంబును కుర్చీకింద ఉంచగా, మరొకరు రిమోట్ కంట్రోల్‌తో పేల్చారు. ఈ ఘటన అనంతరం విద్యాశాఖ అధికారులు పాఠశాలను సందర్శించి విచారణ జరిపి చర్యలు చేపట్టారు. యూట్యూబ్‌(Youtube) చూసి పేలుడు పదార్థాలను(Explosion) తయారు చేయడం నేర్చుకున్నారని తెలిసింది. పిల్లలను పాఠశాల నుంచి బహిష్కరించడంపై చర్చలు జరిగాయని, అయితే తల్లిదండ్రులు క్షమాపణలు చెప్పి, భవిష్యత్తులో విద్యార్థులు ఈ విధంగా ప్రవర్తించబోరని హామీ ఇచ్చారని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విద్యార్థుల అకృత్యాలపై పంచాయతీ పెట్టారు. పంచాయితీ సమయంలో తరగతికి చెందిన 15 మంది విద్యార్థుల్లో 13 మంది ఈ చర్యపై అవగాహన కల్పించారు. విద్యార్థులందరినీ వారం రోజుల పాటు సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) నరేష్ మెహతా తెలిపారు. అదృష్టవశాత్తూ గాయాలు లేకుండా ఉపాధ్యాయురాలు బయటపడింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story