వివాహేతర సంబంధం ఆ ఇద్దరి హత్యకు కారణమైంది. భార్య, ఆమె ప్రియుడిని అతి దారుణంగా చంపేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

వివాహేతర సంబంధం ఆ ఇద్దరి హత్యకు కారణమైంది. భార్య, ఆమె ప్రియుడిని అతి దారుణంగా చంపేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని కల్లకుర్చి జిల్లా మలై కొట్టాలంకు చెందిన కొలంజి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య లక్ష్మి(46)కి, అదే గ్రామానికి చెందిన తంగరాసు(39)తో కొంత కాలంగా వివాహేతర సంబంధం నడుస్తోంది. ఈ విషయం తెలియడంతో కొలంజి వారిని హెచ్చరించాడు. ఇది మానుకోవాలని హెచ్చరించాడు. అయినా లక్ష్మి, తంగరాసులు తగ్గేదేలే అనుకున్నారు. ఈ నేపథ్యంలో తంగరాసు బుధవారం అర్ధరాత్రి కొలంజి ఇంటిపైన లక్ష్మిని కలిశాడు. వారిని గమనించిన కొలంజి.. తీవ్ర ఆగ్రహావేశంతో ఇంట్లోని కత్తితో ఇద్దరి తలలను నరికాడు. వాటిని బ్యాగులో వేసుకొని గురువారం తెల్లవారుజామున బస్సులో వేలూరు సెంట్రల్‌ జైలుకు చేరుకున్నాడు. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు జరిగిన విషయాన్ని తెలియజేశాడు. వెంటనే వారు కల్లకుర్చి పోలీసులకు సమాచారమిచ్చారు. కల్లకుర్చి పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కొలంజిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ehatv

ehatv

Next Story