హైదరాబాద్ డాక్టర్ అహ్మద్ మోహియుద్దీన్ సయ్యద్ అరెస్టుతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

హైదరాబాద్ డాక్టర్ అహ్మద్ మోహియుద్దీన్ సయ్యద్ అరెస్టుతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ హైదరాబాద్‌కు చెందిన 35 ఏళ్ల డాక్టర్ అహ్మద్ మోహియుద్దీన్ సయ్యద్‌ను అరెస్ట్ చేశారు. MBBS డిగ్రీ చైనాలో పూర్తి చేశాడు. ఇతనితో పాటు ఇద్దరు ఉత్తరప్రదేశ్ వాసుల అజ్జద్ సులేమాన్ షైఖ్, మొహమ్మద్ సుహైల్ మొహమ్మద్ సాలిం ఖాన్‌లను అరెస్ట్ చేసింది. ఇది ISIS (ఇస్లామిక్ స్టేట్) స్పాన్సర్డ్ బయో-టెర్రర్ ప్లాట్‌గా గుర్తించబడింది. అహ్మద్‌ తన హైదరాబాద్‌లోని ఇంటిని ప్రయోగశాలగా మార్చి ఆముదం గింజల వ్యర్థాలతో రైసిన్ విషాన్ని తయారు చేస్తున్నాడని, దీనితో దేశవ్యాప్తంగా కుట్రలు చేయాలనుకున్నాడని దర్యాప్తులో తేలింది. ఆముదం గింజల నుంచి ఆయిల్ తీసివేసిన తర్వాత మిగిలిన వ్యర్థం నుంచి రైసిన్‌ను తయారు చేస్తున్నాడు. ఇది అతి ప్రమాదకర విషం, 1 కిలో రైసిన్‌తో 10 వేల మందిని చంపవచ్చు. కిడ్నీ-లివర్ ఫెయిల్యూర్‌కు కారణమవుతుంది. ఆన్‌లైన్‌లో కెమికల్స్ ఆర్డర్ చేసి, రహస్య ప్రయోగాలు చేస్తున్నాడు. ఫ్యామిలీ అనుమానం వ్యక్తం చేసినా, కమర్షియల్ కెమికల్ అని చెప్పాడు. దీన్ని ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్‌లోని పలు ప్రాంతాలను టార్గెట్ చేసి, ప్రసాదం లేదా నీటిలో కలిపి మాస్ పాయిజనింగ్ చేయాలని ప్లాన్ చేశాడు. ఆముదం నూనె ప్రమాదకరం కాదు. నూనె తీసిన తరువాత వచ్చే పిప్పిని ప్రత్యేకంగా శుద్ధి చేసి, ఈ రైసిన్ తీస్తారు. ఈ రైసిన్‌ను శరీరంలో చొప్పించడం ద్వారా, ఇంజెక్షన్ ద్వారా, నోటితో తీసుకోవడం ద్వారా, చర్మం ద్వారా కూడా రైసిన్ ప్రమాదకరంగా మారుతుంది. దానికి వాసన, రుచి ఉండదు. అందుకే అది ఆహారంలో కలిసిన విషయాన్ని ఎవరూ గుర్తించలేరు.

Updated On
ehatv

ehatv

Next Story