కాంగ్రెస్ నాయకుడు, బహరంపూర్ అభ్యర్థి అధిర్ రంజన్ చౌదరి సంచలన

కాంగ్రెస్ నాయకుడు, బహరంపూర్ అభ్యర్థి అధిర్ రంజన్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు డబ్బు పంపకపోవడంతోనే పార్లమెంటులో పారిశ్రామికవేత్తలపై నిందలు వేస్తుంటామని రెడ్ మైక్‌ అనే మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు. తమకు డబ్బులు అందడం లేదు కాబట్టే విమర్శలు చేస్తున్నామని.. ఒకవేళ అదానీ, అంబానీ డబ్బు సంచులు పంపితే వారికి వ్యతిరేకంగా తాను మాట్లాడనని అధిర్ రంజన్‌ అన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. వారు తమకు డబ్బు పంపరు కాబట్టి.. తాను మాట్లాడతానని అన్నారు. ఆ డబ్బు వచ్చి ఉంటే.. అది నాకు చాలా ఉపయోగపడి ఉండేదని అన్నారు. ఆ డబ్బు తనకు చాలా అవసరమన్నారు. అదానీ ఒక మూట నిండా డబ్బు పంపిస్తే అది తనకు సరిపోతుందన్నారు.

అధిర్‌ రంజన్‌ మాట్లాడిన వీడియో క్లిప్‌ను బీజేపీ ట్విట్టర్ లో షేర్‌ చేసింది. డబ్బుల సంచులు అందితే, పార్లమెంటులో ఏ విషయం గురించైనా మౌనంగా ఉంటారని, వారికి డబ్బు రాకపోతే, వివాదాలు సృష్టిస్తామని అధిర్ చెప్పారని అన్నారు. బహరంపూర్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు అధిర్ రంజన్ చౌదరి.

Updated On 13 May 2024 10:14 PM GMT
Yagnik

Yagnik

Next Story