ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానంలో

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానంలో బీడీ తాగినందుకు 42 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. మహ్మద్ ఫక్రుద్దీన్ మహమ్మద్ అమ్ముద్దీన్ అనే ప్రయాణికుడు ఢిల్లీ నుండి ముంబైకి ఇండిగో విమానంలో వెళ్తూ టాయిలెట్‌లో బీడీ తాగాడు. బీడీ వాసన రావడంతో సిబ్బందికి అనుమానం వచ్చి పరిశీలించగా టాయిలెట్‌లో బీడీ కనిపించింది. అతడిని విచారించగా, తాను బీడీ తాగానని ఒప్పుకున్నాడు. ముంబైలో విమానం దిగగానే సహర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై IPC సెక్షన్ 336, ఎయిర్‌క్రాఫ్ట్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

గత ఏడాది మేలో విమానంలో బీడీ తాగినందుకు బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 56 ఏళ్ల వ్యక్తిని ఇదే తరహాలో అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని మార్వార్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి అహ్మదాబాద్ నుండి ఆకాశ విమానంలో బయలుదేరాడు. టాయిలెట్‌లో ధూమపానం చేస్తున్నట్లు ఎయిర్‌లైన్ సిబ్బంది గుర్తించారు. తాను మొదటిసారి విమానంలో ప్రయాణం చేస్తున్నానని.. తనకు నిబంధనలు తెలియవని పోలీసులకు చెప్పాడు నిందితుడు.

Updated On 5 March 2024 10:39 PM GMT
Yagnik

Yagnik

Next Story