ఉత్తర ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో 65 ఏళ్ల మహిళను ఆమె 45 ఏళ్ల ప్రియుడు దినేష్ కుమార్ (Dinesh Kumar)హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఉత్తర ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో 65 ఏళ్ల మహిళను ఆమె 45 ఏళ్ల ప్రియుడు దినేష్ కుమార్ (Dinesh Kumar)హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సరాయ్ అకిల్ (Sarai Akil) పోలీస్ స్టేషన్ పరిధిలోని బరై గ్రామంలో జరిగింది. దినేష్ కుమార్ తన ప్రియురాలిని గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు దినేష్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి మృతురాలి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు, సరాయ్ అకిల్ పోలీస్ స్టేషన్ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఈ హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

అదనపు పోలీస్ సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. విచారణ సమయంలో దినేష్ తన నేరాన్ని అంగీకరించాడని చెప్పారు. సావరి దేవికి పిల్లలు లేరని, పెళ్లైన 6-7 సంవత్సరాల తర్వాత ఆమె భర్త ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడని దినేష్ తెలిపాడు. సావరి దేవి తన అత్తగారింట్లో ఒంటరిగా నివసిస్తుందని ఏఎస్‌పీ వివరించారు.

దినేష్ సావరి దేవికి పాలు, ఇతర అవసరమైన వస్తువులను అందించేవాడు. కాలక్రమేణా, ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఆ తర్వాత వారి మధ్య శారీరక సంబంధాలు కూడా ఏర్పడ్డాయి. పోలీసులకు విచారణలో "నేను, సావరి దేవి తరచుగా రాత్రిపూట ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్ళం. కొన్నిసార్లు అర్ధరాత్రి నేను ఆమె ఇంటికి కూడా వెళ్ళేవాడిని. మే 23వ తేదీ రాత్రి సుమారు 10 గంటలకు నేను ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ఆమె ఇంటికి వెళ్లి సెక్స్‌ చేయాలని కోరా. కానీ సావరి దేవి ఆరోగ్యం బాగోలేదని చెప్పి నిరాకరించింది. అది ఆమె నాటకమని నేను భావించాను", కానీ ఆరోజు తనను బలవంతం చేశా. ఆమె నిరాకరించినా నేను బలవంతం చేయబోయాను''. కానీ ఆమె నన్ను పక్కకు నెట్టివేసింది. దీంతో కోపంతో నేను ఒక గుడ్డ ముక్కతో ఆమె గొంతు నులిమి చంపేశాను" అని చెప్పాడు. అరెస్టు భయంతో దినేష్ ఆమె మొబైల్ ఫోన్‌ను లాక్కుని తన ఇంటి దగ్గర ఉన్న కాలువలో పడేశాడు.

ehatv

ehatv

Next Story