యశవంతపుర (karnataka)లో జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి, దక్షిణ కన్నడ జిల్లాలోని మూడబిదిరె తాలూకాలోని బడగమిజారులో సోషల్ మీడియా (Instagram) ద్వారా ప్రేమలో పడిన ఒక వివాహిత మహిళ.

యశవంతపుర (karnataka)లో జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి, దక్షిణ కన్నడ జిల్లాలోని మూడబిదిరె తాలూకాలోని బడగమిజారులో సోషల్ మీడియా (Instagram) ద్వారా ప్రేమలో పడిన ఒక వివాహిత మహిళ.. ఒక పురుషుడు ఆత్మహత్య చేసుకున్నారు.. ఈ సంఘటన ఇరు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తూ, సోషల్ మీడియా ప్రభావం వల్ల సంభవించిన విషాదంగా వర్ణించబడింది.

మూడబిదిరె తాలూకా బడగమిజారు(Badagamijaru)కు చెందిన వివాహిత నమీక్ష శెట్టి (Namiksha Shetti)(29), ఆమె ప్రియుడు బాగలకోటలో నిడ్డోడిలో నివాసం ఉంటున్న ప్రశాంత్‌(Prashanth)లు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. నమీక్ష శెట్టికి వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. ఆమె భర్త పూణె(Pune)లో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె పుట్టింటిలో ఉంటోంది. ఆమెకు ఇన్‌స్టా గ్రాంలో ప్రశాంత్‌తో పరిచయం ఏర్పడింది. డ్రైవర్‌ అయిన ఇతనికి కూడా పెళ్లయి భార్యతో విడాకులు తీసుకున్నారు.

అప్పుడప్పుడు ప్రశాంత్‌, నమీక్ష ఇంటికి వచ్చి వెళ్లేవాడు. బుధవారం కూడా ఆమె ఇంటికి వచ్చాడు, అప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆమె పరిగెత్తి వెళ్లి ఇంటి పక్కనే ఉన్న బావిలోకి దూకింది. వెంటనే ప్రశాంత్‌ కూడా బావిలోకి దూకేశాడు. ఫైర్‌ సిబ్బంది, పోలీసులు గాలించి మృతదేహాలను బావిలోంచి బయటకు తీశారు. మూడబిదిరె(Moodbidire )ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతుదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు.

ehatv

ehatv

Next Story