రేపటి నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు(Parliament Sessions) ప్రారంభం కానున్నాయి.

రేపటి నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు(Parliament Sessions) ప్రారంభం కానున్నాయి.

ఈ సమావేశాలలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitharaman) తన ఏడో కేంద్ర బడ్జెట్‌(Budget 2024)ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె రేపు పార్లమెంట్‌లో ఆర్ధిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. మర్నాడు అంటే జూలై 23వ తేదీన బడ్జెట్‌ను సమర్పిస్తారు. వరుసగా ఏడు బడ్జెట్‌లు సమర్పించిన రికార్డును నిర్మలా సీతారామన్‌ సాధించబోతున్నారు. ఇప్పటి వరకు ఈ రికార్డు మోరార్జీ దేశాయ్‌ పేరిట ఉంది. 1959 నుంచి 1964 వరకు మోరార్జీ దేశాయ్‌ దేశ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. దేశానికి ఆరు బడ్జెట్లు సమర్పించి రికార్డు సృష్టించారు. ఇందులో అయిదు పూర్తి బడ్జెట్లు కాగా ఒకటి మధ్యంతర బడ్జెట్. ఈ పార్లమెంట్‌ సమావేశాలలోనే కొన్ని కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్ర కసరత్తులు ప్రారంభించింది. ఫైనాన్స్ బిల్లు, భారతీయ వాయుయాన్ విధేయక్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ లా, బాయిలర్స్ బిల్లు, కాఫీ, రబ్బరు బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story