అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్పీజీ సిలిండర్ల ధరలను

modi gas low
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు."ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా, LPG సిలిండర్ ధరలను రూ. 100 తగ్గించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. ఇది దేశవ్యాప్తంగా మిలియన్ల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది, ముఖ్యంగా మన నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుంది" అని ప్రధాన మంత్రి ట్వీట్ చేశారు.
గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.100 మేర తగ్గించేందుకు నిర్ణయించామని.. ఈ నిర్ణయం భారతీయులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని మోదీ అన్నారు. దేశంలోని నారీశక్తికి ఇది ఎంతో ఉపయోగకరమని వివరించారు. భారతీయ కుటుంబాల క్షేమం కోసమే గ్యాస్ సిలిండర్ ధరలను అందుబాటులోకి తెవడమే తమ లక్ష్యమని.. ఈజ్ ఆఫ్ లివింగ్ (సులభతర జీవనం) నినాదానికి అనుగుణంగా గ్యాస్ ధరలు తగ్గించేందుకు నిర్ణయించామన్నారు.
మార్చి 1న, చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) 19 కిలోల వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ పెంపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ రూ. 1,795.00కి అందుబాటులోకి వచ్చింది. కోల్కతాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సవరించిన ధరలు రూ.1,911.00, ముంబైలో రూ.1,749.00, చెన్నైలో రూ.1,960.50గా ఉన్నాయి.


