ఉమ్మడి రాష్ట్రం విభజన తర్వాత తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఎదిగిందంటారు. దిగ్గజ ఐటీ సంస్థలు.. ఐదు అంకెల జీతం పొందే టెకీలు ఎక్కువగా ఉన్న నగరం హైదరాబాద్

ఉమ్మడి రాష్ట్రం విభజన తర్వాత తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఎదిగిందంటారు. దిగ్గజ ఐటీ సంస్థలు.. ఐదు అంకెల జీతం పొందే టెకీలు ఎక్కువగా ఉన్న నగరం హైదరాబాద్(Hyderabad). అయితే ధనిక రాష్ట్రంగా చెప్పుకున్న తెలంగాణ ఈ విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్‌ కంటే వెనుకబడిందని తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. రెండు రాష్ట్రాల్లో కోటీశ్వర్లు ఎక్కువగా ఏపీలోనే ఉన్నట్లు వెల్లడించింది. ఆదాయపు పన్ను చెల్లింపుదారుల ఆధారంగా డేటా విశ్లేషణ చేయగా జాతీయ మీడియా వెలువరించిన కథనాల్లో ఏపీలో దాదాపు 5,340 మంది ఏడాదికి కోటి రూపాయలు కన్నా ఎక్కువగా సంపాదిస్తున్నట్లు వెల్లడైంది.

ఏపీ(Ap)తో పోల్చుకుంటే తెలంగాణ(Telangana)లోనే ఎక్కువగా ఐటీ పరిశ్రమలు ఉన్నాయి. అంతేకాకుండా హైదరాబాద్ రియల్ భూమ్ చూస్తే ఎక్కువ డబ్బు తెలంగాణలోనే సంపాదించే అవకాశాలు ఉన్నాయని చెప్తారు. కానీ, వాస్తవ లెక్కల్లో ఏపీలోనే అత్యధిక వ్యక్తిగత అదాయం సంపాదిస్తున్నట్లు వెల్లడైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కోటి రూపాయలు కన్నా ఎక్కువ సంపాదిస్తున్న వారి జాబితాలో ఏపీ, తెలంగాణ కంటే చాలా దూరంలో ఉందిది. రెండు రాష్ట్రాల్లో హైదరాబాద్ ప్రధాన వ్యాపార, వాణిజ్య కేంద్రంగా విలసిల్లుతోంది. ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్ ఇలా ఒకటేంటి చాలా రంగాలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ లెక్కన హైదరాబాద్లోనే ఎక్కువ మంది కోటీశ్వరులు ఉంటారని ఎవరైనా భావిస్తారు. కానీ, ఆదాయపు పన్ను రిటర్న్ పరిశీలిస్తే తెలంగాణను వెనక్కి నెట్టి ఏపీ వాసులు ఎక్కువ సంఖ్యలో కోటికి పైగా సంపాదిస్తున్నారు.

ఏపీలో ఏడాదిలో 5340 మంది కోటికి పైగా ఆర్జిస్తుండగా, తెలంగాణలో కేవలం 1,260 మంది మాత్రమే కోటి ఆదాయం వస్తున్నట్లు ప్రభుత్వానికి రిటర్స్న్ దాఖలు చేశారు. దేశంలో కోటి రూపాయలు దాటి ఆదాయం సంపాదిస్తున్న వారు ఎక్కువగా మహారాష్ట్ర(Maharastra)లో ఉన్నారని చెబుతున్నారు. ఆ రాష్ట్రంలో 1,24,800 మంది కోటీశ్వరులు ఉన్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో సుమారు 20,500 మంది ఏడాదికి కోటికి పైగా సంపాదిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో 24,500 మంది కోటీశ్వరులు ఉన్నట్లు వెల్లడైంది. అయితే ఏపీ, తెలంగాణల్లో మాత్రం ఈ లెక్కలు చాలా ఆశ్చర్యానికి గురిచేశాయని అంటున్నారు.

తెలంగాణ తరహాలో కర్ణాటక(Karnataka)లోనూ కోటీశ్వరుల సంఖ్య తక్కువగానే ఉందని చెబుతున్నారు. హైదరాబాద్ కంటే ఐటీలో అగ్రస్థానంలో ఉన్న బెంగళూరు(Benguluru) కూడా అధిక ఆదాయం వచ్చే నగరంగా భావిస్తారు. కానీ, తాజాగా చూస్తే ఆ రాష్ట్రంలోనూ కేవలం 2,816 మంది మాత్రమే కోటికి పైగా ఆర్జిస్తున్నట్లు రిటర్న్స్ దాఖలు చేశారు. దీంతో తెలంగాణ, కర్ణాటకల్లో అధిక ఆదాయం వస్తున్నా, వ్యక్తిగత ఆదాయం తక్కువగా చూపుతున్నారనే అనుమానాలను ఎక్కువ చేస్తోందని అంటున్నారు.

ehatv

ehatv

Next Story