రిటైర్మెంటు డబ్బుతో గ్రామానికి తాగునీరు.. ఒడిశా టీచర్‌ ఆదర్శం

ఒడిశాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు పదవీ విరమణ నాడు.. తాను టీచర్‌గా పనిచేసిన గ్రామాన్ని నీటిసంక్షోభం నుంచి గట్టెక్కించారు. పురీ జిల్లాలోని అస్తరంగ్‌ బ్లాకు పట్సుందర్‌పుర్‌ గ్రామ ఉన్నత పాఠశాలలో మాగుని మల్లిక్‌ 18 ఏళ్లపాటు టీచర్‌గా పనిచేశారు. ఈ గ్రామస్థులు తాగునీటి కోసం 4 కిలోమీటర్లు నడిచి వెళ్లడం ఆయన తరచూ గమనించేవారు. గ్రామంలోని నీటి ట్యాంకు నిరుపయోగంగా మారింది. గ్రామస్థులు పలుమార్లు ప్రభుత్వ అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో తన ఉద్యోగ విరమణ నాడు మల్లిక్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రిటైర్మెంటుతో వచ్చిన డబ్బు, దాచుకున్న సొమ్ము కలిపి రూ.10 లక్షల ఖర్చుతో నీటి ట్యాంకుకు మరమ్మతు చేయించి, ఆక్వా గార్డ్‌ను అమర్చారు. చాలా ఇళ్లకు కొళాయిలు ఏర్పాటు చేయించారు.

Updated On
ehatv

ehatv

Next Story