Women Murder: తోడబుట్టిన చెల్లెలే అని దగ్గరికి తీసుకుంది.. చెల్లెలు కొడుకే తన కొడుకు అనుకుంది.. కట్ చేస్తే..!

తోడబుట్టిన చెల్లెలే కదా అని దగ్గరికి తీసుకుంది. ఆమె కొడుకును కన్నకొడుకుకు కంటే ఎక్కువగా చూసుకుంది. కట్‌ చేస్తే ఇద్దరూ కలిసి ఆమె ప్రాణమే తీసేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఈనెల 19న స్థానిక బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీస్‌లో ఫస్ట్ డివిజన్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జయలక్ష్మి (58) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మొదటగా ఆమెది అందరూ ఆమెది సహజ మరణమే అనుకున్నారు. కానీ జయలక్ష్మి లివ్-ఇన్ భాగస్వామి శ్రీనివాస్ అనుమానాలు వ్యక్తం చేస్తూ చిక్కనాయకనహళ్లి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అసలు విషయం తెలిసింది. జయలక్ష్మి సోదరి, ఆమె కొడుకే హత్య చేశారని చిక్కనాయకనహళ్లి పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఊపిరి ఆడకుండా చేయడం వల్లే ఆమె చనిపోయిందని పోస్ట్‌ మార్టం నివేదిక కూడా స్పష్టం చేసింది. ఈ కేసులో సోదరి అనసూయ, ఆమె కుమారుడు చంద్రశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 19న జయలక్ష్మి మృతి చెందగా, ఒక రోజు తర్వాత ఆమె అంత్యక్రియలకు సన్నాహాలు చేస్తుండగాఅసలు విషయం తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story