సార్వత్రిక ఎన్నికల(General elections) ముందు ఎలక్టోరల్‌ బాండ్‌ స్కీమ్‌పై(electoral bonds) నానా రాద్ధాంతం జరిగింది

సార్వత్రిక ఎన్నికల(General elections) ముందు ఎలక్టోరల్‌ బాండ్‌ స్కీమ్‌పై(electoral bonds) నానా రాద్ధాంతం జరిగింది. బీజేపీ(BJP) అడ్డంగా బుక్కయ్యింది. దీనిపై కొందరు సుప్రీంకోర్టుకు(supreme court) కూడా వెళ్లారు. ఇవాళ ఈ స్కీమ్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ పథకంపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎలక్టోరల్‌ బాండ్స్‌ విరాళాల ద్వారా కార్పొరేట్లు, రాజకీయ పార్టీల మధ్య క్విడ్‌ ప్రోకో జరిగిందనే ఆరోపణపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఫిబ్రవరిలో రాజకీయ పార్టీలకు అనామక నిధులను అనుమతించే ఎలక్టోరల్‌ బాండ్ల స్కీమ్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఎలక్టోరల్‌ బాండ్ల జారీని నిలిపివేయాలని ఎస్‌బీఐని ఆదేశించిన విషయం విదితమే!

Updated On
Eha Tv

Eha Tv

Next Story