ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమని అడిగినందుకు టీచర్‌ను హత్య చేసిన ఘటన

కర్ణాటక రాష్ట్రంలోని కలబురిగి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు ఓ మహిళా టీచర్‌ను హత్య చేసి, ఆనవాళ్లు లేకుండా చేయడానికి మృతదేహాన్ని కాల్చి బూడిద చేసిన దారుణ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బీదర్ జిల్లా భాల్కి తాలూకాలోని వందేర్ ఖేడా గ్రామానికి చెందిన జ్యోతి కపాలే (57) అనే మహిళ టీచర్‌గా పని చేస్తున్నారు. ఆమెకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి అయిన ఆనంద్ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆమె వద్ద నుంచి రూ.14 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. నమ్మకంతో వెంటనే డబ్బు ఇచ్చిన జ్యోతి, కొన్ని నెలలు గడిచినా అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో అతడిని గట్టిగా నిలదీశారు.

దీంతో కోపం తెచ్చుకున్న నిందితుడు ఆనంద్, ఆమెపై పగ పెంచుకుని హత్య చేయాలని ప్రణాళిక రచించాడు. ఈ క్రమంలో, కలబురిగిలోని తన కుటుంబ సభ్యులను కలిసేందుకు వెళ్తున్న సమయంలో జ్యోతిపై దాడి చేసి, హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం, తన నేరానికి ఆనవాళ్లు లేకుండా చేసేందుకు మృతదేహాన్ని కాల్చి బూడిద చేసినట్లు విచారణలో బయటపడింది

Updated On
ehatv

ehatv

Next Story