ట్రైనీ ఐఏఎస్‌(Trainee Officer) పూజా ఖేద్కర్‌(Puja Kedekar) వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తున్నది.

ట్రైనీ ఐఏఎస్‌(Trainee Officer) పూజా ఖేద్కర్‌(Puja Kedekar) వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తున్నది. ఆమె అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే ఆమెపై అనేక ఆరోపణలు రావడంతో ఆమె శిక్షణ కార్యక్రమాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఆపేసింది. లేటెస్ట్‌గా తెలిసిందేమిటంటే దివ్యాంగ ధ్రువీకరణ పత్రం కోసం ఆమె ఓ ఫ్యాకర్టీ చిరునామా ఇచ్చింది. యూపీఎస్‌సీ పరీక్షలో అహ్మద్‌నగర్ జిల్లా సివిల్‌ హాస్పటిల్‌ 2018, 2021లో జారీ చేసిన వికలాంగ సర్టిఫికెట్లను సమర్పించింది. తర్వాత 2022లో కూడా ఔధ్‌ ఆసుపత్రిలో వైకల్య ధ్రువీకరణ పత్రం కోసం అప్లై చేసుకుంది. అయితే ఈ ఆసుపత్రి ఆ అప్లికేషన్‌ను తిరస్కరించింది. తర్వాత ఆమె 2022, ఆగస్టు 24వ తేదీన యశ్వంత్‌ రావ్‌ మెమోరియల్‌ ఆసుపత్రిలోవైకల్య ధ్రువీకరణ పత్రం లభించింది. ఇందులో పూజా ఖేద్కర్‌ చించ్వాడ్‌లో ఉన్న ఓ ఫ్యాక్టరీ అడ్రస్‌ ఇచ్చింది. ఆమె సమర్పించిన అడ్రస్‌లో ఓ ఇంజినీరింగ్‌ కంపెనీ ఉంది. ఆమె ఉపయోగించిన ఆడీ కారు కూడా ఇదే కంపెనీ పేరుతో రిజిస్టరై ఉంది. ఆ కంపెనీ స్థానిక పురపాలక సంఘానికి 2.7 లక్షల రూపాయల పన్నులు బకాయి పడినట్లు రికార్డుల్లో ఉంది. మరోవైపు వికలాంగ ధ్రువీకరణ కోసం ఆధార్‌కార్డు తప్పనిసరి. కానీ ఆమె మాత్రం రేషన్ కార్డే(Ration card) సమర్పించింది. ఆ రేషన్ కార్డు కూడా నకిలీది కావడం గమనార్హం. మరో విచిత్రమేమిటంటే ఆమెది లోకోమార్‌ వైకల్యంగా డాక్టర్లు సర్టిఫై చేస్తూ మోకాలికి సంబంధించిన పాత గాయం ఉందని తెలిపారు. మొత్తంగా ఆమెకు ఏడు శాతం వైకల్యం ఉన్నట్లు తేల్చారు. కానీ యూపీఎస్సీలో రిజర్వేషన్‌ పొందాలంటే కచ్చితంగా 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉండకూడదు. అది రూల్‌! మరి పూజా ఖేద్కర్‌ ఆ కేటగిరిలో ఉద్యోగం ఎలా సంపాదించినట్టు? ఇది ఇప్పుడు తేలాల్సిన విషయం!

Updated On
Eha Tv

Eha Tv

Next Story