ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) ఔరైయాలో ఈ సంఘటన జరిగింది.

ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) ఔరైయాలో ఈ సంఘటన జరిగింది. భోలే మందిర్(Bhole mandir) సమీపంలో అనిల్ కుమార్(anil kumar) అనే వ్యక్తి ఒక షాపు బయట వస్తువులు ఉంచాడు. దీంతో పక్కషాపులకు చెందిన పవన్ కుమార్, సన్నీ, లక్కీ నిలదీశారు. వారి మధ్య గొడవ మొదలయ్యింది. అది ముదిరిపోయింది. ఘర్షణకు(Fight) దారి తీసింది. ఆ వ్యాపారులు ఒకరినొకరు కొట్టుకోవడం మొదలుపెట్టారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. అంగీలు చించుకున్నారు. రోడ్డుపై దొర్లి కొట్టుకున్నారు. స్థానికులు ఆపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ గొడవ తర్వాత అనిల్‌ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పవన్ కుమార్, సన్నీ, లక్కీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఫైటింగ్ కు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. 2021లో ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో చిరు వ్యాపారుల మధ్య జరిగిన కొట్లటను ఇది గుర్తు చేసింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story