నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొంటోంది.
ఇటీవల ఆమె కాశీకి వెళ్లి అక్కడి అన్నపూర్ణా దేవిని దర్శించుకుంది.
ఈ సమయంలో ఆమె చేతిలో రుద్రాక్ష దండతో అమ్మవారిని దర్శించుకుంది.
సాయి పల్లవికి చెందిన కాశీ యాత్ర ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.
తెలుగులో నాగ చైతన్యతో కలిసి ఆమె నటించిన "తండేల్" సినిమా త్వరలో విడుదలవుతుంది.
అంతేకాక, నితేష్ తివారీ దర్శకత్వంలో ఆమె "రామాయణ" సినిమాలో సీత పాత్రలో నటిస్తోంది.
ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా కనిపించనున్నాడు.
తొలి భాగం 2026లో దీపావళి సందర్భంగా, రెండో భాగం 2027లో విడుదల కానుంది.