నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'డాకు మహారాజ్' ప్రమోషన్లు వేగవంతమయ్యాయి.
ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందాయి.
సినిమా విడుదల సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది.
ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ సినిమా కోసం పలు ఈవెంట్లను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రత్యేకతగా, జూనియర్ ఎన్టీఆర్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.
నాగవంశీ, తారక్ మధ్య మంచి సంబంధం ఉండటంతో, తారక్ ఈ ఈవెంట్‌కు రావడం ఖాయమని పరిశ్రమలో చర్చ సాగుతోంది.
ఈవెంట్‌లో బాబాయ్ బాలకృష్ణతో పాటు అబ్బాయి తారక్ కూడా పాల్గొనే అవకాశం ఉందన్నది వార్తల సారాంశం.